Stock market today : ఫ్లాట్గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 10 పాయింట్ల లాస్
13 February 2023, 9:17 IST
- Stock market today : దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ ఇండియా
Stock market today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 7 పాయింట్లు కోల్పోయి 60,675 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 12పాయింట్ల నష్టంతో 17,844 వద్ద ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 123 పాయింట్ల నష్టంతో 60,682 వద్ద స్థిరపడింది. 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 17,856 వద్దకు చేరింది. ఇక 5 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 41,559 వద్ద ముగిసింది. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60,653- 17,859 వద్ద మొదలుపెట్టాయి.
స్టాక్స్ టు బై..
LT share price target : ఎల్టీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2125, టార్గెట్ రూ. 2200- రూ. 2225
HDFC bank share price target : హెచ్డీఎఫ్సీ బ్యాంక్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 1625, టార్గెట్ రూ. 1690- రూ. 1710
సుమిటోమో కెమికల్ ఇండియా (సుమికెమ్):- బై రూ. 450, స్టాప్ లాస్ రూ. 435, టార్గెట్ రూ. 475
ఐజీఎల్:- బై రూ. 442, స్టాప్ లాస్ రూ. 425, టార్గెట్ రూ. 470.
లాభాలు.. నష్టాలు..
ఎం అండ్ ఎం, ఇండస్ఇండ్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
నెస్లే, ఇన్ఫీ, ఎన్టీపీసీ, సన్ఫార్మా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock market investment tips in telugu : శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ముగిసింది. డౌ జోన్స్ 0.5శాతం, ఎస్ అండ్ పీ 500 0.22శాతం పెరిగాయి. నాస్డాక్ 0.61శాతం పడింది.
ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.5శాతం పతనమైంది. సౌత్ కొరియా కాస్పి 0.3శాతం నష్టపోయింది.
త్రైమాసిక ఫలితాలు..
Nykaa Q3 results : నైకా, జీ ఎంటర్టైన్మెంట్, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్, సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ, శ్రీ రేణుకా షుగర్స్, సెయిల్, బజాజ్ హెల్త్కేర్, బజాజ్ హిందుస్థాన్ షుగర్, బీఎఫ్ యుటిలిటీస్, బీజీఆర్ ఎనర్జీ సిస్టెమ్స్, గ్రిండ్వెల్ నార్టన్తో పాటు మరిన్ని సంస్థ త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1458.02కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే డీఐఐలు రూ. 291.34కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.