Stock market news today : ఫ్లాట్గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 5 పాయింట్ల లాభం
06 January 2023, 9:17 IST
- Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.
ఇండియా స్టాక్ మార్కెట్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 51 పాయింట్ల లాభంతో 60,404 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 5పాయింట్లు పెరిగి 17,997 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ ప్రతికూల పవనాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ను నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 304 పాయింట్ల నష్టంతో 60,353 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 50 పాయింట్లు కోల్పోయి 17,992 వద్దకు చేరింది. బ్యాంక్ నిఫ్టీ.. 350 పాయింట్ల లాస్తో 42,608 వద్ద ముగిసింది. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్- నిఫ్టీలు వరుసగా 60388- 18008 వద్ద మొదలుపెట్టాయి.
ఫెడ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ బయటకు రావడంతో అంతర్జాతీయ ప్రతికూల పవనాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణం దిగొస్తున్నప్పటికీ.. వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందని.. గత ఫెడ్ సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. ఫలితంగా వడ్డీ రేట్ల పెంపు తీవ్రత కొనసాగుతుందని మార్కెట్లో భయాలు నెలకొనడంతో మదుపర్లు అమ్మకాలపై దృష్టిపెట్టారు.
పివోట్ ఛార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్ట్ 17,915- 17,861- 17,774 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 18,089- 18,142- 18,229 వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
Stocks to buy list : ఐటీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 326, టార్గెట్ రూ. 340- రూ. 350
లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్టీ):- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2050, టార్గెట్ రూ. 2125- రూ. 2150
Stocks to buy విప్రో:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 365, టార్గెట్ రూ. 410
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, రిలయన్స్, ఎన్టీపీసీ, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
సన్ఫార్మా, హెచ్సీఎల్టెక్, ఇన్ఫీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంశం నేపథ్యంలో గురువారం ట్రేడింగ్ సెషన్ను అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగించాయి. డౌ జోన్స్ 1.02శాతం పతనమైది. ఎస్ అండ్ పీ 500 1.16శాతం, నాస్డాక్ 1.47శాతం నష్టాల్లో ముగిశాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీతో పాటు సౌత్ కొరియా 0.37శాతం, ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.34శాతం పెరిగాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1449.45కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు కూడా 194.09కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.