Sovereign Gold Bond : తక్కువ ధరకే బంగారం కొనాలా? ఇదిగో మంచి ఛాన్స్..
18 December 2022, 12:58 IST
Sovereign gold bond scheme 2022-23 : సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సిరీస్ 3ని ఆర్బీఐ లాంచ్ చేసింది. ఆ వివరాలు..
తక్కువ ధరకే బంగారం కొనాలా? ఇదిగో మంచి ఛాన్స్..
Sovereign gold bond scheme 2022-23 : సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్లోని మరో సిరీస్ను ప్రకటించింది ఆర్బీఐ. ఇది సోమవారం ఓపెన్ అవుతుంది. ఈ నెల 23 వరకు ఈ స్కీమ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ కోసం ఇష్యూ ప్రైజ్ను గ్రామ్కు రూ. 5,409గా నిర్ణయించింది ఆర్బీఐ.
"సావరిన్ గోల్డ్ బాండ్ నామినష్ వాల్యూ గ్రామ్కు రూ. 5,409గా ఉంటుంది," అని ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
Sovereign gold bond scheme latest news : ఆన్లైన్లో అప్లై చేసి, డిజిటల్ మోడ్లో పేమెంట్ చేసే సబ్స్క్రైబర్స్కు గ్రామ్కు రూ. 50 చొప్పున తగ్గింపు లభిస్తోంది. ఆర్బీఐతో సంప్రదింపులు జరిపిన అనంతరం.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
"ఇలాంటి ఇన్వెస్టర్లకు గ్రామ్ బంగారం ధర రూ. 5,359గా ఉంటుంది," అని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Sovereign gold bond scheme issue price : 2022-23 సావరిన్ గోల్డ్ బాండ్లో ఇది మూడొవ సిరీస్. నాలుగోవ సిరీస్.. మార్చ్ 06-10 మధ్యలో ఓపెన్ అవుతుందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
సబ్స్క్రిప్షన్ మొదలవ్వడానికి ముందు వారంలో.. గోల్డ్ బాండ్ ఇష్యూ ప్రైజ్ను నిర్ణయిస్తారు. 999 ప్యూరిటీ గోల్డ్కు సంబంధించి.. ముందు వారంలో మూడు క్లోజింగ్ ధరలను తీసుకుని యావరేజ్ చేసిన తర్వాత.. ధరను నిర్ణయిస్తారు. ఇందుకోసం ఐబీజేఏ(ఇండియ బులియన్ అండ్ జ్యువెల్లరీ అసోసియేషన్ లిమిటెడ్) ప్రచురించే ధరను పరిగణిస్తారు.
Sovereign gold bond scheme : షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ- బీఎస్ఈలో అమ్ముతారు.
ఈ సావరిన్ గోల్డ్ బాండ్ టెన్యూర్ 8ఏళ్లు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత రిడీమ్ చేసుకునే వెసులుబాటు ఉంది. నామినల్ వాల్యూపై సెమీ-యాన్యువెల్గా 2.50శాతం ఫిక్స్డ్ వడ్డీ లభిస్తుంది. ఆర్థిక ఏడాదిలో.. గోల్డ్ బాండ్స్పై మ్యాగ్జిమం లిమిట్ 4 కేజీలు. ట్రస్ట్లకు 20కేజీల వరకు లిమిట్ ఉంటుంది. ఈ బాండ్స్తో లోన్లు కూడా తీసుకోవచ్చు.
Sovereign gold bond series 3 details : 2015 నవంబర్లో తొలిసారిగా ఈ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ను లాంచ్ చేశారు. ఫిజికల్ గోల్డ్ను తగ్గించేందుకు, ప్రజల ఫైనాన్షియల్ సేవింగ్స్ను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఈ గోల్డ్ బాండ్స్కు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. వీటిని పెట్టుబడి ఆప్షన్ కింద ప్రజలు పరిగణించడం మొదలుపెట్టారు.