Gold and silver rates today : స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలివే!
15 November 2022, 6:10 IST
- Gold and silver rates today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 48,260గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4,82,600గా కొనసాగుతోంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 4,826గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 52,640గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,26,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5,264గా ఉంది.
Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,360గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,760గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,260 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 52,640గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,010గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,470గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 48,270గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 52,670గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,260గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,640గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,290గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 52,670గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 48,260గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,640గా ఉంది.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు కూడా మంగళవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,170గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 61,700కి చేరింది. సోమవారం కూడా ఇదే ధర పలికింది.
Silver rates today : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 67,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 61,700.. బెంగళూరులో రూ. 67,000గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం మరింత పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 80 పెరిగి.. రూ 26,580కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,500గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,580గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)