తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rates Today : మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు..

Gold and Silver rates today : మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు..

Sharath Chitturi HT Telugu

27 May 2023, 5:45 IST

    • Gold and Silver rates today : దేశంలో పసిడి ధరలు మరింత పడ్డాయి. వెండి ధర కూడా తగ్గింది. ఆ వివరాలు..
మ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (REUTERS)

మ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold and Silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం మరింత తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 దిగొచ్చి.. రూ. 55,650కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 55,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 తగ్గి, రూ. 5,56,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,565గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 160 తగ్గి.. రూ. 60,710కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 60,870గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1600 దిగొచ్చి.. రూ. 6,07,100గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,071గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,860గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,650 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 60,710గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,050గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,150గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 55,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,760గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,650గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,710గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,700గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,760గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 55,650గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,710గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,290గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 150 తగ్గి.. రూ. 72,900కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 73,050గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 76,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 72,900.. బెంగళూరులో రూ. 76,200గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 60 పెరిగి.. రూ 27,280కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,220గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,280గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)