Gold and silver rates today : స్థిరంగా పసిడి- దిగొచ్చిన వెండి ధరలు..
26 November 2022, 6:12 IST
- Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు తగ్గాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 48,550గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4,85,500గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 4,855గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 52,970గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,29,700గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5,297గా ఉంది.
Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,120గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 52,970గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,350గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,840గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 48,550గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 52,970గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,550గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,970గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,600గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 53,120గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 48,550గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,970గా ఉంది.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,200గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 200 తగ్గి.. రూ. 62,000కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 62,200గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 68,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 62,000.. బెంగళూరులో రూ. 68,000గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 220 తగ్గి.. రూ. 25,950కి చేరింది. ఆ ముందు రోజు ధర రూ. 26,170గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,950గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)