దోశలు మనందరికీ ఇష్టమైన అల్పాహారమే. అయితే దోశలను బియ్యం పిండితో చేయడం వలన అందులో కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. అలాకాకుండా ప్రోటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే పప్పులు, కాయధాన్యాలు కలిపి చేసుకుంటే ఆ అల్పాహారం ఎంతో బలవర్థకమైనది, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు 3-4 పప్పుల మిశ్రమంతో రుచికరంగా మిక్స్డ్ దాల్ దోశ (Mixed Dal Dosa) చేసుకోవచ్చు.
మిక్స్డ్ దాల్ దోశను అడై దోశ (Adai Dosa) అని కూడా అంటారు. దక్షిణ భారతదేశంలో ఇది చాలా పాపులర్ రెసిపీ కూడా. మిక్స్డ్ దాల్ దోశ చూడటానికి సెట్ దోశలాగా, మందపాటి అట్టులాగా ఉంటుంది. మీరు కావాలంటే సన్నగా కూడా చేసుకోవచ్చు. మరింత రుచిగా, ఆరోగ్యకరంగా చేయడానికి ఇందులో క్యారెట్, క్యాబేజీ, పాలకూర, పచ్చిబఠానీలు మొదలైన వాటిని కలుపుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు మిక్స్డ్ దాల్ దోశకు కావలసిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
అంతే మిక్స్డ్ దాల్ దోశ రెడీ, దీనిని వేడివేడిగా కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ, సాంబార్ లేదా రసంతో సర్వ్ చేసుకోవచ్చు.