తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Diwali Special Trains: కాజీపేట్, ఖమ్మం, గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

Diwali Special Trains: కాజీపేట్, ఖమ్మం, గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu

16 October 2022, 5:52 IST

    • south central railway special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
సికింద్రాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు,
సికింద్రాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు,

సికింద్రాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు,

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... దీపావళి నేపథ్యంలో మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ - తిరుపతి, సికింద్రాబాద్ - సంత్రగాచి, నర్సాపూర్ - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు వివరాలను చూస్తే....

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

secunderabad - tirupati sepcail trains: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు అక్టోబర్ 19వ తేదీన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 08.25 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 07.50 నిమిషాలకు తిరుపతి చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఇక తిరుపతి నుంచి అక్టోబర్ 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు బయల్జేరి... మరునాడు ఉదయం 05.45 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగరి, గుడూరు, నెల్లూరు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగాం స్టేషన్లలో ఆగుతుంది.

secunderabad - santragachi special trains: సికింద్రాబాద్ - సంత్రగాచి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ రైళ్లు అక్టోబర్ 21వ తేదీన ఉదయం 08.40 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10.25 నిమిషాలకు సంత్రగాచి చేరుతుంది. ఇక సంత్రగాచి నుంచి అక్టోబర్ 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు బయల్దేరి... మరునాడు రాత్రి 09.00 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు....నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్ కోట్, దువ్వాడ, విశాఖ, విజయనగరం, ఖుద్రారోడ్, కటక్, భద్రక్, బాలాసోర్, కరగ్ పూర్ స్టేషన్లలో ఆగుతుంది.

secunderabad - narsapur trains: నర్సాపూర్ - సికింద్రాబాద్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నారు. ఈ రైలు అక్టోబర్ 18వ తేదీన నర్సాపూర్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 04.10 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుతుంది.

ఈ రైలు పాలకొల్లు, భీమవరం, అకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

మరోవైపు హైదరాబాద్ నగరంలో ఇవాళ (అక్టోబర్ 16)నడిచే పలు ఎంఎంటీఎస్ రైళ్లను పలు రూట్లలో రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈమేరకు వివరాలను ప్రకటించింది.

NOTE:

లింక్ పై క్లిక్ చేసి దక్షిణ మధ్య రైల్వే తాజా అప్డేట్స్ తెలుసుకోవచ్చు.