తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ngt Report : తెలంగాణలో అత్యంత కలుషితమైన నది ఇదే

NGT Report : తెలంగాణలో అత్యంత కలుషితమైన నది ఇదే

HT Telugu Desk HT Telugu

09 October 2022, 18:44 IST

    • NGT Report On Polluted River : తెలంగాణలో అత్యంత కలుషితమైన నది మూసీ అని ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. మైనింగ్ జరుగుతున్న మంచిర్యాల, కొత్తగూడెం ప్రాంతాలు కూడా ఈ జాబితాలోకి వెళ్లాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో అత్యంత కలుషితమైన నది మూసీ(Musi River) అని ఎన్జీటీ నివేదిక పేర్కొంది. నాగోల్‌(Nagole)ను అత్యంత కాలుష్య ప్రదేశంగా తెలిపింది. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(PCB) ద్వారా కలుషిత ప్రాంతాలపై నివేదిక ప్రకారం నదిలో అధిక స్థాయి కోలిఫాం కనుగొంది. దానితో పాటు కరిగిన ఆక్సిజన్ (DO), బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) అసమతుల్య స్థాయిలు కనుగొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

Warangal : వరంగల్ శివారులో అమానుషం - పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టారు..!

TS SET Notification 2024 : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల - మే 14 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

Army Public School Jobs 2024 : బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు - అప్లికేషన్ ప్రాసెస్, ఖాళీల వివరాలివే

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మూసీ, గోదావరి(Godavari), కృష్ణా, మంజీర, మానేరు, కిన్నెరసాని 26 వేర్వేరు ప్రదేశాలు, ఎనిమిది పారామితులను ఉపయోగించి పర్యవేక్షించింది. వీటిలో DO, pH, వాహకత, BOD, టోటల్ కోలిఫాం, ఉచిత అమ్మోనియా, బోరాన్, SAR (సోడియం శోషణ నిష్పత్తి) ఉన్నాయి. ఈ సర్వే 2022 జనవరి నుండి జూన్ మధ్య జరిగింది. ఇవి కాకుండా హైదరాబాద్(Hyderabad) నుంచి నల్గొండ (కృష్ణా, మూసీ), గౌడిచెర్ల నుంచి నక్కవాగు (మంజీర), గండిలచ్చపేట నుంచి సేవాలాల్ తండా (నక్కవాగు), పాల్వంచ (కిన్నెరసాని), వరంగల్ నుంచి సోమన్‌పల్లి (మానేరు), బాసర నుంచి ఖమ్మం (గోదావరి)ను పరిశీలించారు.

సర్వే చేసిన 26 స్థానాల నుండి నాగోల్ లో లీటరుకు 18 mg BOD, తక్కువ కరిగిన ఆక్సిజన్ (DO) స్థాయిలు 0.3 mg/l, కోలిఫాం స్థాయిలు 1600 mpn/100 ml, 1,395 మిల్లీసీమెన్స్/ వాహకతతో అత్యధిక కాలుష్య కారకాలను నమోదు చేసింది. ఇక్కడ నీరు మానవ, జంతువుల వినియోగానికి పనికిరాదని సూచిస్తుంది. BOD అనేది నీటి నుండి వ్యర్థ సేంద్రియ పదార్థాన్ని తీయడానికి అవసరమైన ఆక్సిజన్ మొత్తం. కండక్టివిటీ అనేది విద్యుత్ ప్రవాహం ద్వారా నీటికి వెళ్ళే సామర్థ్యం.

కోలిఫాం ఈ నీటిలో ఎక్కువగా ఉంది. కోలిఫాం కారణంగా జనాలకు వాంతులు, జ్వరం, డయేరియా, కామెర్లు, తలనొప్పి, అలసట లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాలు ఎక్కువ. బావి, బోరు బావి నుంచి భూగర్భ జలాలను తాగునీటిగా వినియోగించే వాళ్లకు ఈ బ్యాక్టీరియాతో ప్రమాదం ఉంటుంది.

మంచిర్యాల, కొత్తగూడెం(Kothagudem) మైనింగ్ కార్యకలాపాలతో గోదావరి(Godavari) జలాలు కలుషితమవుతున్నాయి. అదేవిధంగా మైనింగ్(Mining) కార్యకలాపాల కారణంగా కరీంనగర్ కూడా హాట్‌స్పాట్‌గా ఉంది. గోదావరి, మూసీలోని మైనింగ్ బెల్ట్‌లు అధిక రేడియేషన్ ఉష్ణోగ్రత మండలాలు, ఇవి వాతావరణ మార్పులను ప్రభావితం చేస్తున్నాయి.