IRCTC Ayodhya Tour: తక్కువ ధరలో 'అయోధ్య' టూర్.. ఈ ప్యాకేజీ చూడండి
21 January 2023, 14:10 IST
- irctc ganga ramayan yatra:అధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించుకోవాలనే వారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి గంగా రామాయణ్ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
హైదరాబాద్ అయోధ్య టూర్
IRCTC Hyderabad - Ayodhya Tour: హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ సరికొత్త ప్యాకేజీ ప్రకటించింది. అయోధ్య, ప్రయాగ్ రాజ్, సార్ నాథ్, వారణాసితో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. గంగా రామాయణ్ యాత్ర (Ganga Ramayan Yatra)పేరిట ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. విమానంలో పర్యాటకుల్ని తీసుకెళ్లి ఆయా ప్రాంతాలను చూపిస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 23వ తేదీన అందుబాటులో ఉంది. షెడ్యూల్ చూస్తే....
Day 1 : హైదరాబాద్ విమానాశ్రయం(Hyderabad Airport) నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరాలి. వారణాసి విమానాశ్రయానికి 9 గంటలకు వరకు చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్ వెళ్తారు. హోటల్లో భోజనం చేసి.. కాశీ దేవాలయం, మధ్యాహ్నం నైమీశర్యణకు వెళ్తారు. రాత్రి లక్నోలోనే బస చేస్తారు.
Day 2 : రెండో రోజు అయోధ్యకు చేరుకుంటారు. పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రి అయోధ్యలోనే బస చేస్తారు.
Day 3 : అయోధ్య ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత ప్రయాగరాజ్ కు వెళ్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.
Day 4 : త్రివేణి సంగమానికి వెళ్తారు. సాయంత్రం వారణాసికి వెళ్తారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.
Day 5 : ఉదయమే కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి వారణాసిలోనే ఉంటారు.
Day 6 : వారణాసిలోని పలు ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం వారణాసి ఎయిర్ పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకుంటారు.
టికెట్ రేట్లు…
ఐఆర్సీటీసీ గంగా రామాయణ్ యాత్ర టూర్ ప్యాకేజీ(IRCTC Ganga Ramayan Yatra) ధర చూసుకుంటే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.27,950గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,500 చెల్లించాలి. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.36,600 ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్(Travel Insurance) కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన జాబితాను చెక్ చేసుకోవచ్చు.
NOTE:
ఈ లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ బుకింగ్ తో పాటు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు