తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu: ఈ సారి టైటిల్ నాదే.. టాలీవుడ్ స్టార్ సింగర్ సోషల్ మీడియాలో స్పష్టం

Bigg Boss 6 Telugu: ఈ సారి టైటిల్ నాదే.. టాలీవుడ్ స్టార్ సింగర్ సోషల్ మీడియాలో స్పష్టం

03 September 2022, 21:15 IST

    • Singer Revanth in Bigg Boss 6: టాలీవుడ్ సింగర్ రేవంత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సారి బిగ్‌బాస్ టైటిల్ తానే గెలుస్తానంటూ తన ఇన్‌స్టా రీల్‌లో పేర్కొన్నాడు.
రేవంత్
రేవంత్ (Instagram)

రేవంత్

Singer Revanth in Bigg Boss 6: తెలుగు నాట బిగ్‌బాస్ షో ఎంత పాపులరైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే బుల్లితెరపై ఐదు సీజన్లు, ఓటీటీ వేదికగా ఓ సారి ప్రేక్షకులను ఆకట్టుకుంది బిగ్‌బాస్. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 6కు రంగం సిద్ధమైంది. ఆదివారం నాడు సాయంత్రం లాంచ్ కానున్న ఈ షో కోసం బిగ్‌బాస్ హౌస్ ఆకర్షణీయంగా ముస్తాబైంది. సీజన్ 3 నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జునే ఈ సారి కూడా ఆయనే హోస్ట్ చేయనున్నారు. అయితే ఈ సారి పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలపై సోషల్ మీడియాలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరు వెళ్తున్నారో అధికారికంగా ఇంత వరకు స్పష్టత రాలేదు. అయితే టాలీవుడ్ టాప్ సింగర్ ఒకరు ఈ సారి బిగ్‌బాస్ టైటిల్ తనదే అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

టాలీవూడ్ స్టార్ సింగర్ రేవంత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. టైటిల్ కోసం భగీరథుడి మాదిరిగా కష్టపడతానని తెలిపాడు. "జీవితంలో కొన్నింటిని వదిలేయడం కష్టంగానే ఉంటుంది. నా భార్యతో పాటు.. నాకు ఇష్టమైన మ్యూజిక్‌ను కూడా ఎంతో మిస్ అవుతున్నా. కానీ ఓ భగీరథుడిలా గెలిచి మంచి పేరుతో బయటకు వస్తా. మీ ఓట్లతో నన్ను గెలిపించండి. ఎంటర్టైన్మెంట్ అంతా సిద్ధమైంది. మీ ఆశీర్వాదాలతో టైటిల్ గెలిచి వస్తాను. త్వరలో కలుద్దాం" అంటూ రేవంత్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ద్వారా తను బిగ్‌బాస్‌కు వెళ్తున్నట్లు చెప్పకనే చెప్పాడు.

ఈ సారి మొత్తం 20 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లనున్నట్లు సమాచారం. 16 మంది డైరెక్టుగా.. మిగిలిన వారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో నడుస్తోన్న చర్చ ప్రకారం.. చలాకి చంటి, యూట్యూబర్ ఆదిరెడ్డి, హీరో అర్జున్ కల్యాణ్, కామన్ మ్యాన్ రాజేశేఖర్, సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్, దీపిక పిల్లి, వాసంత కృష్ణన్, గీతూ రాయల్, నటి శ్రీ సత్య, అభినయశ్రీ, రోహిత్, మెరీనా అబ్రహం తదతరులు ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.