తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli-gambhir Fight Video : గౌతమ్ గంభీర్​తో కోహ్లీ గొడవ.. ఫ్యాన్స్ కోసమేనా? ఇదిగో వీడియో

Kohli-Gambhir Fight Video : గౌతమ్ గంభీర్​తో కోహ్లీ గొడవ.. ఫ్యాన్స్ కోసమేనా? ఇదిగో వీడియో

Anand Sai HT Telugu

02 May 2023, 8:24 IST

    • Virat Kohli-Gautam Gambhir Fight : ఐపీఎల్ లో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆర్సీబీ-లక్నో మ్యాచ్ జరిగాక విరాట్ కోహ్లీ-గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. అయితే ఇది ఫ్యాన్స్ కోసమేనా అని చర్చ జరుగుతోంది.
కోహ్లీ-గంభీర్ మధ్య గొడవ
కోహ్లీ-గంభీర్ మధ్య గొడవ (twitter)

కోహ్లీ-గంభీర్ మధ్య గొడవ

IPL 2023 : లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌(IPL Match)లో ఓ సంఘటన చోటు చేసుకుంది. లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో RCB 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఆటగాళ్ల మధ్య కరచాలనం సందర్భంగా విరాట్ కోహ్లీ(Virat Kohli) , గౌతమ్ గంభీర్(Gautam Gambhir) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది . ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించకుండా ఆర్‌సీబీ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఫలితంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 108 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆర్సీబీ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ విజయాన్ని విరాట్ కోహ్లీ(Virat Kohli) ఘనంగా జరుపుకొన్నాడు. ఆ తర్వాత ఆటగాళ్ల మధ్య షేక్ హ్యాండ్ సందర్భంగా కోహ్లీ, లక్నో ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో గౌతమ్ గంభీర్ వచ్చాడు. దీంతో వాగ్వాదం ఎక్కువైంది. ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు తిట్టుకున్నట్టుగా అర్థమవుతోంది.

అంతే కాకుండా పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు మధ్యలోకి ప్రవేశించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన ఫైట్ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.

ఇదే కారణమా?

ఏప్రిల్ 10న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 1 వికెట్ తేడాతో RCBని ఓడించింది. ఈ విజయాన్ని సంబరాలు చేసుకుంటున్న లక్నో సూపర్‌జెయింట్స్(lucknow super giants) జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్.. చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్‌సీబీ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి నోరు మూసుకోమని సైగ చేశాడు.

దీనిపై స్పందించిన విరాట్ కోహ్లి అభిమానులకు ఫ్లై కిస్ ఇచ్చి హ్యాండ్ సైగలు చేశాడు. 4వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ వేసిన బౌండరీ లైన్‌లో కృనాల్ పాండ్యా.. విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. క్యాచ్ పట్టిన తర్వాత కింగ్ కోహ్లీ ప్రేక్షకుల గ్యాలరీ వైపు చూశాడు. చిన్నస్వామి స్టేడియంలో గౌతమ్ గంభీర్ వార్నింగ్ ఇచ్చిన రీతిలోనే అభిమానులకు నోరు మెదపవద్దని విరాట్ కోహ్లీ చెప్పడం విశేషం. ఇదే అంశంపై గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగి ఉంటుందని చర్చ మెుదలైంది.