Woman run over by Vande Bharat Express: ‘వందేభారత్’ ఢీ కొని మహిళ మృతి
08 November 2022, 23:01 IST
Woman run over by Vande Bharat Express: భారతీయ రైల్వే ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్ల బ్యాడ్ టైమ్ కొనసాగుతోంది. వరుస ప్రమాదాలతో ప్రతీరోజు ఈ వందే భారత్ రైళ్లు వార్తల్లో నిలుస్తున్నాయి.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ (ఫైల్ ఫొటో)
Woman run over by Vande Bharat Express: సెమీ హై స్పీడ్ ట్రైన్ వందేభారత్ మంగళవారం మరో ప్రమాదం బారిన పడింది. గుజరాత్ లోని ఆనంద్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతున్న మహిళను వందే భారత్ రైలు ఢీ కొట్టింది.
Woman run over by Vande Bharat Express: మహిళ దుర్మరణం
గుజరాత్ లోని ఆనంద్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న వందే భారత్ ట్రైన్ ఆనంద్ సమీపంలో రైల్వే ట్రాక్ దాటుతున్న మహిళను ఢీ కొట్టింది. దాంతో, ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. సెప్టెంబర్ 30న ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ట్రైన్ ను ప్రారంభించారు. ఈ రైలుకు ఆనంద్ లో హాల్ట్ లేదు.
Woman run over by Vande Bharat Express: బంధువును చూడ్డానికి వచ్చి..
ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళను బీట్రైస్ ఆర్చిబాల్డ్ పీటర్(54)గా గుర్తించారు. అహ్మదాబాద్ కు చెందిన ఈ మహిళ తన బంధువును కలుసుకోవడం కోసం ఆనంద్ కు వచ్చారు. ఈ రైలు ఇప్పటికి మూడుసార్లు ప్రమాదాల బారిన పడింది. మూడు సార్లు కూడా పట్టాలపై ఉన్న పశువులను ఢీ కొనడంతో ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ప్రతీ సారీ రైలు ముందు భాగం ధ్వంసమైంది.