తెలుగు న్యూస్  /  National International  /  Sonia Admitted To Delhi Hospital, Siddaramaiah Wishes Her 'Healthy Return'

Sonia admitted to Delhi hospital: ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

HT Telugu Desk HT Telugu

04 January 2023, 16:26 IST

  • Sonia admitted to Delhi hospital: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం నుంచి ఆమె శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు.

సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)
సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)

సోనియా గాంధీ (ఫైల్ ఫొటో)

Sonia admitted to Delhi hospital: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ లో చేరారు. సోనియాగాంధీ కూతురు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోనియా గాంధీకి తోడుగా ఆసుపత్రికి వెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Sonia admitted to Delhi hospital for routine check up: రొటీన్ చెక్ అప్..

అయితే, రొటీన్ చెక్ అప్ కోసమే సోనియా గాంధీ సర్ గంగారామ్ హాస్పిటల్ లో చేరారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో చలి వాతావరణం కారణంగా సోనియా గాంధీకి స్వల్పంగా శ్వాస సంబంధ సమస్య ఎదురైందని వివరించాయి. తమ తల్లి సోనియా గాంధీ అనారోగ్య సమాచారం తెలియగానే, యూపీలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అనంతరం, బుధవారం ఉదయం 6 గంటలకు మళ్లీ భారత్ జోడో యాత్రలో రాహుల్ పాల్గొన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ యూపీ వ్యవహారాల ఇన్ చార్జ్ గా ఉన్న ప్రియాంక గాంధీ బుధవారం తన తల్లి సోనియాగాంధీ తో పాటు హాస్పిటల్ కు వెళ్లినందువల్ల, ఈ భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదు.

Get well soon to Sonia: గెట్ వెల్ సూన్..

స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లవెత్తుతున్నాయి. సోనియా గాంధీ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. భారత్ జోడో యాత్ర బుధవారం ఉత్తర ప్రదేశ్ లోని మావికలన్ నుంచి ప్రారంభమైంది. సోనియా గాంధీ పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. గత సంవత్సరం ఆమె కోవిడ్ బారిన కూడా పడ్డారు.