తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

HT Telugu Desk HT Telugu

12 March 2022, 9:21 IST

    • దిల్లీలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో.. ఏడుగురు మృతి చెందారు. గుడిసెల్లో మంటలు చెలరేగటంలో ఘటన చోటు చేసుకుంది. 
దిల్లీలో అగ్ని ప్రమాదం
దిల్లీలో అగ్ని ప్రమాదం (twitter)

దిల్లీలో అగ్ని ప్రమాదం

దిల్లీ గోకుల్​పురి ప్రాంతంలో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో ఏడుగురు మృతి చెందారు. శివార్లలోని 60 గుడిసెల్లో మంటల చెలరేగి.. ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 

మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధితులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ సంతాపం వ్యక్తం చేశారు.