Pakistani drone: పాక్ డ్రోన్ లో ఏకే 47, బుల్లెట్లు; కూల్చేసిన బీఎస్ఎఫ్
11 March 2023, 20:48 IST
Pakistani drone: పాకిస్తాన్ భూభాగం నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఒక డ్రోన్ ను సరిహద్దు భద్రత దళం కూల్చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
పంజాబ్ లోని గుర్దాస్ పూర్ జిల్లాలో ఉన్న మెట్ల గ్రామం సమీపంలో పాక్ డ్రోన్ ను బీఎస్ఎఫ్ (BSF) జవాన్లు కూల్చేశారు.
Pakistani drone: డ్రోన్ పై ఏకే 47
పాక్ భూభాగం నుంచి భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఆ డ్రోన్ కు ఒక ఏకే 47 రైఫిల్ ను, కొన్ని బుల్లెట్లను అమర్చారని బీఎస్ఎఫ్ (BSF) అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆకాశంలో డ్రోన్ ను గుర్తించి, వెంటనే స్పదించిన జవాన్లు దాన్ని కూల్చేశారని, కూల్చేసిన అనంతరం, ఆ డ్రోన్ కు ఒక ఏకే 47 రైఫిల్ ను, కొన్ని బుల్లెట్లను అమర్చిన విషయాన్ని గుర్తించారని తెలిపారు. పంజాబ్ లోని పాక్ సరిహద్దుల్లో ఈ ఘటన జరిగిందన్నారు. ఆ డ్రోన్ నుంచి ఒక ఏకే 47 రైఫిల్, 40 రౌండ్ల బుల్లెట్లు లభించాయని వెల్లడించారు.
టాపిక్