Gold rates today | మూడు నెలల కనిష్ఠానికి పసిడి ధరలు.. నేటి లెక్కలివే..
13 May 2022, 13:17 IST
- Gold and silver rates today | దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నేటి లెక్కలకు సంబంధించిన వివరాలు..
దిగొచ్చిన బంగారం ధర
Gold and silver rates today | దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు మరింత దిగొచ్చాయి. ఎమ్సీఎక్స్ గోల్ట్ ఫ్యూచర్స్.. 0,03శాతం మేర పడ్డాయి. ఫలితంగా 10గ్రాముల పసిడి ధర రూ. 50,158గా ఉంది. ఇది మూడు నెలల కనిష్ఠ స్థాయి.
గత సెషన్లో గోల్డ్ ధరలు 1.2శాతం మేరపడ్డాయి. ఈ వారంలో ఇప్పటివరకు గోల్డ్ ధర రూ. 1,500 మేర దిగొచ్చింది(10గ్రాములు). ఫలితంగా.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ర్యాలీ( ఫిబ్రవరి నుంచి)లో లాభాలన్నీ ఉడ్చుకుపోయాయి. మార్చ్ నెల తొలి వారంలో బంగారం ధర రూ. 56,000 మార్క్ను అందుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా అదే పరిస్థితి. అమెరికా డాలర్ బలపడటంతో పసిడికి డిమాండ్ తగ్గుతోంది. ఒక ఔన్సు స్పాట్ గోల్డ్ 0.1శాతం పడి 1,829.54 డాలర్లకు వచ్చింది.
"డాలర్ ఇండెక్స్ 20ఏళ్ల గరిష్ఠానికి చేరడంతో గోల్డ్ ధరలు పడుతున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పుడు.. గోల్డ్లో పెట్టుబడులు పెరుగుతాయి. ప్రస్తుతం ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. కానీ బంగారం డిమాండ్ పడింది. అంతర్జాతీయ మార్కెటలలో లిక్విడిటీ లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. అన్నిచోట్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. బంగారం ధరలు ఇంకా పడే అవకాశం లేకపోలేదు," అని యాక్సిస్ సెక్యూరిటీస్కు చెందిన ప్రీతమ్ పట్నాయక్ అన్నారు.
వెండి ఇలా..
మరోవైపు దేశీయ మార్కెట్లో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 0.3శాతం వృద్ధి చెంది కేజీకి రూ. 58,920కు చేరింది. గత సెషన్లో వెండి 3.3శాతం(రూ. 2,000) మేర పడింది.
టాపిక్