తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Kills Family Members: ఘాతుకం.. తల్లిదండ్రులు సహా నలుగురిని నరికి చంపిన యువకుడు

Man kills family members: ఘాతుకం.. తల్లిదండ్రులు సహా నలుగురిని నరికి చంపిన యువకుడు

23 November 2022, 12:31 IST

    • Delhi man kills four family members: ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు.. ఏకంగా కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు. తల్లిదండ్రులతో పాటు సోదరి, నానమ్మను కత్తితో పొడిచి పాశవికంగా చంపాడు.
Delhi Palam Murder Case: ఘటన జరిగిన ఇంటి ముందు గుమికూడిన స్థానికులు
Delhi Palam Murder Case: ఘటన జరిగిన ఇంటి ముందు గుమికూడిన స్థానికులు (PTI)

Delhi Palam Murder Case: ఘటన జరిగిన ఇంటి ముందు గుమికూడిన స్థానికులు

Delhi Palam Murder Case: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. తండ్రి, తల్లి, సోదరి, నానమ్మను ఓ 25ఏళ్ల యువకుడు కిరాతకంగా చంపాడు. నలుగురిని కత్తితో పొడిచి పాశవికంగా హతమార్చాడు. సౌత్ ఢిల్లీలోని పాలమ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని కేశవ్‍గా పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు.

Palam Murder Case: కుటుంబం మొత్తాన్ని కడతేర్చాడు

తండ్రి దినేశ్, తల్లి దర్శన, సోదరి ఊర్వశి, నానమ్మ దీవెన దేవీలను నిందితుడు కేశవ్ హత్య చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. కుటుంబంలోని నలుగురిని అతడు కడతేల్చాడని వెల్లడించారు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ హత్యల గురించి సమాచారాన్ని పోలీసులు అందుకున్నారు. ఈ ఘటన జరిగిన ఇంటి పై అంతస్థులో ఉన్న వారు తమకు సమాచారం అందించాలని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

Delhi Palam Murder Case: గొంతులు కోసి..

ఘటన స్థలానికి పోలీసులు వెళ్లగా.. నలుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు కనిపించాయని సౌత్ వెస్ట్ పోలీస్ డెప్యూటీ కమిషనర్ మనోజ్ చెప్పారు.

కుటుంబ సభ్యులను చంపేందుకు కేశవ్.. పదునైన ఆయుధాన్ని వాడాడు. దాంతో గొంతులను కోశాడు. పలుమార్పు పొడిచాడు. తల్లిదండ్రుల శవాలు బాత్‍రూమ్‍లు లభ్యం కాగా, సోదరి, నానమ్మ మృతదేహాలు వేరే రూమ్‍ల్లో ఉన్నాయని.. ఈ భయానక విషయాలను పోలీసులు తెలిపారు.

ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తి, బంధువులు.. నిందితుడు పారిపోకుండా పట్టుకున్నారని పేర్కొన్నారు.

Man kills four family members: ఉద్యోగం పోయి..

నిందితుడు కేశవ్‍కు సరైన ఉద్యోగం లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గుర్గావ్‍లోని ఓ ఉద్యోగం చేస్తుండగా.. నెల క్రితం దాన్ని కూడా కేశవ్ మానేసినట్టు పోలీసులు చెప్పారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులతో గొడవ జరగగా.. ఈ క్రమంలోనే నలుగురికి కేశవ్ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Man kills four family members: డ్రగ్స్‌కు బానిసై?

అయితే, ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు కేశవ్.. డ్రగ్స్ కు బానిసయ్యాడని కూడా తెలుస్తోంది. ఆ వ్యసనం మానేందుకు రిహ్యాబిలిటేషన్ సెంటర్ లో చేరిన అతడు.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన మరుసటి రోజునే తల్లిదండ్రులతో సోదరి, నానమ్మను కూడా చంపాడని సమాచారం. ఈ కేసును పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.