తెలుగు న్యూస్  /  National International  /  Congress' Jalandhar Mp Santokh Singh Chaudhary Dies During Bharat Jodo Yatra

MP Santokh Singh death : భారత్​ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో ఎంపీ మృతి!

14 January 2023, 10:30 IST

  • Congress MP Santokh Singh Chaudhary death : పంజాబ్​లో జరగుతున్న భారత్​ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్​ ఎంపీ సంతోఖ్​ సింగ్​.. గుండెపోటుతో మరణించారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయానికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ధ్రువీకరించారు.

గుండెపోటుతో కాంగ్రెస్​ ఎంపీ సంతోఖ్​​ సింగ్​ మృతి
గుండెపోటుతో కాంగ్రెస్​ ఎంపీ సంతోఖ్​​ సింగ్​ మృతి (ANI)

గుండెపోటుతో కాంగ్రెస్​ ఎంపీ సంతోఖ్​​ సింగ్​ మృతి

Congress MP Santokh Singh Chaudhary death : పంజాబ్​లో కొనసాగుతున్న భారత్​ జోడో యాత్రలో శనివారం ఉదయం తీవ్ర విషాదం నెలకొంది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్​ ఎంపీ సంతోష్​ సింతోఖ్​ సింగ్​ చౌదరి.. గుండెపోటుతో మరణించారు.

ట్రెండింగ్ వార్తలు

Nainital fire: నైనిటాల్ అడవుల్లో కార్చిచ్చు; జనావాసాల్లోకి విస్తరిస్తున్న మంటలు

JEE Advanced 2024 : నేడు జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

Indians killed in US : అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత మహిళలు మృతి- చెట్టుకు ఇరుక్కున్న కారు!

Water Crisis : నీటి సంక్షోభానికి అడుగు దూరంలో తెలంగాణ, ఆంధ్ర..!

ఒక్కసారిగా కుప్పకూలిన సంతోఖ్​ సింగ్​..

శనివారం ఉదయం ఫిల్లౌర్​ ప్రాంతం నుంచి భారత్​ జోడో యాత్రను ప్రారంభించారు రాహుల్​ గాంధీ. వందలాది మంది కార్యకర్తలు, పార్టీ నేతలు, ఎంపీలు.. రాహుల్​ గాంధీతో కలిసి నడిచారు. జలంధర్​ ఎంపీ సంతోఖ్​ సింగ్​ చౌదరి కూడా యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటనను చూసిన రాహుల్​ గాంధీ.. ఆయన వద్దకు వెళ్లారు. అంబులెన్స్​ కూడా వచ్చింది.

Santokh Singh Chaudhary death : కొద్ది క్షణాల్లోనే.. సంతోఖ్​ సింగ్​ను అంబులెన్స్​లో ఫగ్వారాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా.. గుండెపోటు కారణంతో మార్గం మధ్యలోనే సంతోఖ్​ సింగ్​ మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు.

సంతోఖ్​ సింగ్​ మరణం నేపథ్యంలో భారత్​ జోడో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

సంతోఖ్​ సింగ్​కు నివాళులు..

santokh Singh Chaudhary Bharat Jodo Yatra : సంతోఖ్​ సింగ్​ అకాల మరణంపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

"కాంగ్రెస్​ జలంధర్​ ఎంపీ సంతోఖ్​ సింగ్​ మరణ వార్త విని చాలా బాధ కలిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను," అని పంజాబ్​ సీఎం భగవంత్​ మన్​ ట్వీట్​ చేశారు.

"ఎంపీ సంతోఖ్​ సింగ్​ చౌదరి జీ అకాల మరణ వార్త విని బాధపడ్డాను. గుండెపోటుతో శనివారం ఉదయం ఆయన మరణించారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను," అని మాజీ కాంగ్రెస్​ సభ్యుడు అమరిందర్​ సింగ్​ ట్వీట్​ చేశారు.

Bharat Jodo Yatra Punjab : "ఎంపీ శ్రీ సంతోఖ్​ సింగ్​ చౌదరి మరణ వార్త విని షాక్​కు గురయ్యాను. పార్టీకి ఆయన మరణ వార్త పెద్ద దెబ్బలాంటిది. ఈ దుఖంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి," అని ట్వీట్​ చేశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.