తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda Rashmika Mandanna Geetha Govindam Sequel On Cards

Geetha Govindam Sequel: విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక మంద‌న్న సూప‌ర్ హిట్ మూవీకి సీక్వెల్ రానుందా?

02 February 2023, 12:07 IST

  • Geetha Govindam Sequel: విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన గీత గోవిందం వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ స‌క్సెస్‌ఫుల్ సినిమాకు సీక్వెల్ రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ర‌ష్మిక మంద‌న్న, విజ‌య్ దేవ‌ర‌కొండ
ర‌ష్మిక మంద‌న్న, విజ‌య్ దేవ‌ర‌కొండ

ర‌ష్మిక మంద‌న్న, విజ‌య్ దేవ‌ర‌కొండ

Geetha Govindam Sequel: విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay deverakonda) గీత‌ గోవిందం సినిమాకు సీక్వెల్ రూపొంద‌నున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లోవార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో 2018లో రిలీజైన గీత‌ గోవిందం వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. వారిద్ద‌రి డైలాగ్స్‌, ల‌వ్ స్టోరీ అభిమానుల‌ను మెప్పించాయి.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

విజ‌య్‌, ర‌ష్మిక క్యారెక్ట‌ర్స్‌ను బేస్ చేసుకొని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ సీక్వెల్ క‌థ‌ను సిద్ధం చేస్తోన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ సీక్వెల్‌కు సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోన్న‌ట్లు తెలిసింది. ఈ సీక్వెల్‌లోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించ‌నున్న‌ట్లు తెలిసింది. హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న‌నే తీసుకుంటారా? ఆమె స్థానాన్ని మ‌రో హీరోయిన్‌తో భ‌ర్తీ చేస్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

గీత గోవిందం సినిమాను నిర్మించిన జీఏ2 పిక్చ‌ర్స్ సంస్థ ఈ సీక్వెల్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం ఈ సీక్వెల్ వార్త‌లు టాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

మ‌హేష్‌బాబు స‌ర్కారువారి పాట త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమాను తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ సిద్ధ‌మ‌య్యారు. కానీ స్క్రిప్ట్ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో ఆ సినిమా ఆగిపోయిన‌ట్లు స‌మాచారం. నాగ‌చైత‌న్య సినిమాను ప‌క్క‌న‌పెట్టిన ప‌ర‌శురామ్ గీత గోవిందం సీక్వెల్‌పై దృష్టిసారించిన‌ట్లు చెబుతున్నారు.

మ‌రోవైపు ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌లు పాన్ ఇండియ‌న్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తోన్న ఖుషి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో మొద‌లుకానుంది. ప్యూర్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

అలాగే జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరితో స్పై యాక్ష‌న్ సినిమా చేయ‌నున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. వీటితో పాటుగా పూరి జ‌గ‌న్నాథ్‌తో జ‌న‌గ‌న‌మ‌ణ అనౌన్స్ చేశాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.