Rashmika Mandanna Pushpa 2: పుష్ప సీక్వెల్ షూటింగ్లో రష్మిక మందన్న జాయిన్ అయ్యేది ఎప్పుడంటే
Rashmika Mandanna Pushpa 2: పుష్ప -2 షూటింగ్లో రష్మిక మందన్న అడుగుపెట్టిది ఎప్పుడో తెలిసిపోయింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ఈ సీక్వెల్కు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Rashmika Mandanna Pushpa 2: దక్షిణాదితో పాటు బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్న(Rashmika Mandanna). గత కొన్నాళ్లుగా హిందీ సినిమాల షూటింగ్స్, ప్రమోషన్స్తో తీరిక లేకుండా గడిపిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పుష్ప- 2 సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నది.
ఫిబ్రవరిలో ఈ సీక్వెల్ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న చెప్పింది. పుష్ప పార్ట్ వన్లో శ్రీవల్లీగా రష్మిక మందన్న క్యారెక్టర్ అభిమానులను ఆకట్టుకొంది. కంప్లీట్ డీ గ్లామర్ లుక్లో మెప్పించింది. సీక్వెల్లో రష్మికను దర్శకుడు సుకుమార్ ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పుష్ప -2 షూటింగ్ వైజాగ్లో జరుగుతోంది.
వైజాగ్ హార్బర్ ఏరియాలో హీరో అల్లు అర్జున్పై (Allu Arjun) దర్శకుడు సుకుమార్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోన్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ షెడ్యూల్ దాదాపు పది రోజుల పాటు కొనసాగనున్నట్లు సమాచారం.
ఈ సీక్వెల్లో జగపతిబాబు నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫహాద్ ఫాజిల్తో పాటు జగపతిబాబు క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్లో సాగనున్నట్లు చెబుతున్నారు. 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప పార్ట్ వన్ సినిమా బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో ఈ సీక్వెల్పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
పాన్ ఇండియన్ లెవల్లో సినీ అభిమానులు పుష్ప -2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఇందులో పుష్పరాజ్ అనే ఎర్రచందనం అక్రమరవాణా చేసే సిండికేట్ నాయకుడిగా అల్లు అర్జున్ నటిస్తున్నారు. . పుష్ప -2 సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.