తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya 42 Update: సూర్య 42 నుంచి అదిరిపోయే అప్డేట్.. పీరియాడికల్ ఫాంటసీగా రానున్న చిత్రం

Suriya 42 Update: సూర్య 42 నుంచి అదిరిపోయే అప్డేట్.. పీరియాడికల్ ఫాంటసీగా రానున్న చిత్రం

25 November 2022, 20:33 IST

    • Suriya 42 Update: కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న తాజా చిత్రాన్ని శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా వెయ్యేళ్ల క్రితం నాటి స్టోరీగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
సూర్య 42
సూర్య 42

సూర్య 42

Suriya 42 Update: కోలీవుడ్ స్టార్ సూర్యకు తమిళంలో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటి నుంచో ఆయన సినిమాలు ఇక్కడ విడుదలవుతూ మంచి హిట్ అందుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆయన ఈటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతేకాకుండా విక్రమ్ సినిమాలో రోలెక్స్‌గా ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే సూర్య తన 42వ చిత్రాన్ని (Suriya 42) ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రానుందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

ఈ విషయాన్ని సూర్య 42 చిత్రానికి ఎడిటర్‌గా పనిచేస్తోన్న నిషద్ యూసుఫ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కనున్న ఫాంటసీగా రానుందని తెలిపారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా 35 రోజుల పాటు గోవాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయని సమాచారం. ఇందుకోసం 100 బౌన్సర్లతో చిత్రబృందం చిత్రీకరణ జరిపిందట.

ఈ సినిమా బ్యాక్ స్టోరీకి సంబంధించిన షూటింగ్‌ను శ్రీలంకలో జరపనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి 60 రోజుల షెడ్యూల్‌లో టీమ్ పాల్గొనుందట. పూర్తిగా అడవుల్లో ఈ షెడ్యూల్ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. భారీ స్థాయి యాక్షన్, యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లోపు ఈ శ్రీలంక షెడ్యూల్ పూర్తవుతుందని చిత్రబృందం తెలిపింది. అనంతరం సూర్య తన తదుపరి సినిమాను మొదలుపెట్టనున్నారు.

ఈ సినిమాలో సూర్య.. అరథార్, వెంకటర్, మాందాకర్, ముక్తార్, పెరుమంతార్ అనే ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. బాలీవుడ్ నటి దిశా పటానీ హీరోయిన్‌గా చేస్తోందట. సూర్య సరసన ఆమె రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. 10 భాషల్లో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.