తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్.. ఎప్పుడో తెలుసా?

NTR centenary celebrations: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్.. ఎప్పుడో తెలుసా?

22 April 2023, 18:27 IST

    • NTR centenary celebrations: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు విజయవాడలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రజినీకాంత్
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రజినీకాంత్

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రజినీకాంత్

NTR centenary celebrations: తెలుగువారి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్ 28న విజయవాడ వేదికగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోనే కాకుండా సౌత్ ఇండియాలోనే మంచి పాపులారిటీ ఉన్న రజినీకి అన్న రామారావు అంటే ఎనలేని అభిమానం.

ట్రెండింగ్ వార్తలు

NNS May 9th Episode: భాగీకి దగ్గరవుతున్న పిల్లలు.. యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న అమర్.. ఆరు కోరికకు మాయమైన యముడు

Kalvan OTT: ఓటీటీలోకి ల‌వ్ టుడే హీరోయిన్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

ఎన్టీఆర్‌తో రజినీకి మంచి అనుబంధం ఉంది. సూపర్ స్టార్ నటించిన భాషా సినిమా తారకరాముడి చేతుల మీదుగానే లాంచ్ అయింది. ఆయనతో ఉన్న అనుబంధం కారణంగా నందమూరి కుటుంబం తారక రాముడి శత జయంతి ఉత్సవాలకు రజినీని చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారట. విజయవాడం పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం జరగనుందని సమాచారం. రజినీ వస్తున్నాడనే వార్త తెలియడంతో నందమూరి-సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ ఈవెంట్‌లో రజినీకాంత్‌తో కలిసి వేదికను పంచుకోనున్నారు నందమూరి బాలకృష్ణ. వీరితో పాటు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే రజినీని, బాలయ్య పలు పబ్లిక్ ఫంక్షన్లలో కలిసి కనిపించారు. అంతేకాకుండా వీరి మధ్య మంచి సాంగత్యం ఉందనే విషయం సినిమా సమాజంలో అందరికీ తెలిసిందే.

ఇటీవల రజినీకాంత్.. చంద్రబాబుతో సమావేశమవడంతో నందమూరి, సూపర్ స్టార్ కుటుంబాల మధ్య బంధం మరింత బలపడిందని తెలుస్తోంది. వీరి కలయిక అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తారక రాముడికి సంబంధించిన ప్రత్యేక నాణెమును ఆవిష్కరించనున్నారట. ఇది ఈ కార్యక్రమంలోనే హైలెట్ కానుందని తెలుస్తోంది. ఏప్రిల్ 28న విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ ఈ ఈవెంట్‌కు వేదిక కానున్నట్లు తెలుస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.