తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ssmb28: రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిన మహేష్‌ బాబు!

SSMB28: రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిన మహేష్‌ బాబు!

HT Telugu Desk HT Telugu

11 July 2022, 9:16 IST

    • SSMB28: సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తన లేటెస్ట్‌ మూవీ సర్కారు వారి పాట సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర భారీగా కలెక్షన్లు రాబట్టడంతో ఇప్పుడతడు తన రెమ్యునరేషన్‌ భారీగా పెంచేశాడు.
మహేష్ బాబు
మహేష్ బాబు (Twitter)

మహేష్ బాబు

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబుకు ఇండస్ట్రీలో ఓ స్పెషల్‌ ఇమేజ్‌ ఉంది. మంచి అందగాడు. ఫిమేల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువగా ఉన్న యాక్టర్‌. అతని సినిమా వస్తుందంటే చాలా భారీ ఓపెనింగ్స్‌ పక్కా. దీంతో అతని డిమాండ్‌కు తగినట్లు రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్‌ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తాజాగా సర్కారు వారి పాట మూవీ కోసం అతడు ఏకంగా రూ.50 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Aavesham OTT: అనుకున్న‌దానికంటే ముందుగానే ఓటీటీలోకి ఫ‌హాద్ ఫాజిల్ వంద కోట్ల మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT: ఓటీటీలో 25 లక్షల మంది మెచ్చిన సినిమా.. సీక్వెల్ కోసం వెయిటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Smile Review: ఆ నవ్వు చూస్తే చనిపోతారు.. స్మైల్ మూవీ రివ్యూ.. ఓటీటీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

ఈ సినిమాను ఒంటిచేత్తో నడిపించేసి బాక్సాఫీస్‌ దగ్గర భారీ కలెక్షన్లు తీసుకొచ్చాడు మహేష్‌బాబు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్‌తో మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఎస్‌ఎస్‌ఎంబీ 28గా పిలుస్తున్న ఈ సినిమా ప్రిప్రొడక్షన్‌ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆగస్ట్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందని ఇప్పటికే మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే కనిపిస్తోంది.

అయితే సర్కారు వారి పాట సూపర్‌హిట్‌ కావడంతో ఇప్పుడీ ఎస్‌ఎస్‌ఎంబీ28 మూవీకి తన రెమ్యునరేషన్‌ పెంచేశాడు మహేష్‌ బాబు. ఈ సినిమా కోసం రూ.70 కోట్లు డిమాండ్‌ చేశాడట. దీనికి ప్రొడ్యూసర్‌ రాధాకృష్ణ కూడా ఓకే చెప్పాడట. మహేష్‌, త్రివిక్రమ్‌ క్రేజీ కాంబినేషన్‌ కావడంతో భారీ ఓపెనింగ్స్‌ పక్కా అన్న అంచనాలు ఉన్నాయి. దీంతో సినిమా లాభాల్లో షేర్‌ ఇవ్వడం కంటే మహేష్‌ డిమాండ్‌ చేసిన రూ.70 కోట్లు ఇవ్వడానికి ప్రొడ్యూసర్‌ ఓకే చెప్పినట్లు సమాచారం.

ఇప్పటికే మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా మూవీస్‌ వచ్చాయి. అతడు ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. ఖలేజా మూవీ కూడా బాగానే ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఇప్పుడు మహేష్‌ కోసమే ఓ ఇంట్రెస్టింగ్‌ స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్‌ రెడీ చేశాడు. గతంలో మహేష్‌ ఎప్పుడూ కనిపించని క్యారెక్టర్‌ అని ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్‌ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.