తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  18 Pages Heart Touching Song: 18 పేజీస్ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్.. అదిరిపోయిన ఎమోషనల్ మెలోడీ

18 Pages Heart touching Song: 18 పేజీస్ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్.. అదిరిపోయిన ఎమోషనల్ మెలోడీ

16 December 2022, 18:38 IST

    • 18 Pages Heart touching Song: నిఖిల్ నటించిన తాజా చిత్రం 18 పేజీస్. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే పాట విడుదలైంది. హార్ట్ టచింగ్ ఎమోషనల్ సాంగ్‌గా వచ్చిన ఈ పాటను తిరుపతి మాట్లా రాయడమే కాకుండా ఆలపించారు.
18 పేజీస్ నుంచి మరో పాట
18 పేజీస్ నుంచి మరో పాట

18 పేజీస్ నుంచి మరో పాట

18 Pages Heart touching Song: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాది కార్తికేయ-2 లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుని మంచి జోరు మీదున్నాడు. దీంతో వరుస చిత్రాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన 18 పేజీస్ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు శ్రోతలను విపరీతంగా అలరించాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది.

ట్రెండింగ్ వార్తలు

NNS May 9th Episode: భాగీకి దగ్గరవుతున్న పిల్లలు.. యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న అమర్.. ఆరు కోరికకు మాయమైన యముడు

Kalvan OTT: ఓటీటీలోకి ల‌వ్ టుడే హీరోయిన్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

నీ వల్ల ఓ పిల్ల అంటూ సాగే ఈ సాంగ్ హార్ట్ టచింగ్ ఎమోషనల్‌గా ఉంది. ఫోక్ సాంగ్ మాదిరిగా ఉన్న ఈ పాట హృదయ విదారకరంగా మంచి ఫీల్‌ను అందిస్తుంది. ఈ సాంగ్‌ను తిరుపతి మాట్ల ఆలపించడమే కాకుండా.. అతడే రాశాడు. గోపీ సుందర్ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు.

వచ్చే వారం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న18 పేజీస్ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. దీంతో సినిమా విడుదల మాత్రమే బాకీ ఉంది. డిసెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

నిఖిల్ సరసన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తోంది. కార్తికేయ 2తో సక్సెస్‌ఫుల్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ 18 పేజీస్‌తో మరోసారి అలరించనున్నారు. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. బన్ని వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. పల్నాటీ సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ఇండియా దర్శకులు సుకుమార్ కథను అందించారు. డిసెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.