Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 40 పాయింట్లు జంప్
30 December 2022, 9:23 IST
- Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇండియా స్టాక్ మార్కెట్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 160 పాయింట్ల లాభంతో 61,294 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 43పాయింట్లు పెరిగి 18234 వద్ద ట్రేడ్ అవుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ను లాభాల్లో ముగించాయి. వాస్తవానికి.. చాలా వరకు నష్టాల్లోనే ఉన్నప్పటికీ.. చివర్లో లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో నిఫ్టీ50.. 68 పాయింట్లు పెరిగి 18,191 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 223 పాయింట్లు వృద్ధిచెంది 61,133 వద్ద ముగిసింది. 424పాయింట్ల లాభంతో 43,252 వద్దకు చేరింది బ్యాంక్ నిఫ్టీ. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 61329- 18259 వద్ద మొదలుపెట్టాయి.
పివోట్ ఛార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్ట్ 18047- 17991 లెవల్స్ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 18228- 18284 లెవల్స్ వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
- Stocks to buy : హీరో మోటోకార్ప్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2670, టార్గెట్ రూ. 2800- రూ. 2850
- గెయిల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 92, టార్గెట్ రూ. 100- రూ. 102
- ఫెడరల్ బ్యాంక్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 132, టార్గెట్ రూ. 147
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
టాటా మోటార్స్, బజాజ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్ఎం, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
పవర్గ్రిడ్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock market news : టెక్ స్టాక్స్ వృద్ధితో అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ను లాభాల్లో ముగించాయి. నాస్డాక్ 2.59శాతం లాభపడగా.. డౌ జోన్స్ 1.05శాతం, ఎస్ అండ్ పీ 500 1.75శాతం వృద్ధి చెందాయి
ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లోనే కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ, ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
చమురు ధరలు..
చమురు ధరలు శుక్రవారం కూడా పడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ 1.2శాతం పతనమై 82.26 డాలర్లకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news : ఇక గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు.. రూ. 572.78కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 515.83కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.