Gold and silver rates today : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
22 November 2022, 6:10 IST
- Gold and silver rates today : దేశంలో పసిడి, వెండి ధరలు దిగొచ్చాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 48,500కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 48,600గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 తగ్గి, రూ. 4,85,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 4,850గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 100 తగ్గి.. రూ. 52,920కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 51,280గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1000 దిగొచ్చి.. రూ. 5,29,200గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5,292గా ఉంది.
Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,070గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,500 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 52,920గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,670గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 48,500గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 52,920గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,920గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,550గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 52,970గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 48,500గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,920గా ఉంది.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు కూడా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,060గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 400 తగ్గి.. రూ. 60,600కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 61,000గా ఉండేది.
Silver rates today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 66,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 60,600.. బెంగళూరులో రూ. 66,500గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం మరింత పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 90 తగ్గి.. రూ 25,580కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,670గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,580గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)