తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today 21st May 2023 Check Latest Prices In Telugu

Gold and silver rates today : పసిడి ప్రియులకు షాక్​.. భారీగా పెరిగిన బంగారం ధర- వెండి కూడా!

Sharath Chitturi HT Telugu

21 May 2023, 5:58 IST

    • Gold and silver rates today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్లాటీనం రేట్లు దిగొచ్చాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (PTI)

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 500 పెరిగి.. రూ. 56,300కి చేరింది. శనివారం ఈ ధర రూ. 55,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ.5,000 పెరిగి, రూ. 5,63,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,630గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 550 వృద్ధి చెంది.. రూ. 61,420కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 60,870గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,500 పెరిగి.. రూ. 6,14,200గా ఉంది.

Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,450గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,570గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,300 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 61,470గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,800గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,960గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 56,350గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,470గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,300గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,420గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,350గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,470గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,300గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,420గా ఉంది.

ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,530గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1000 పెరిగి రూ. 75,300కి చేరింది. శనివారం ఈ ధర రూ. 74,300గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 79,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 75,300.. బెంగళూరులో రూ. 79,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ.90 తగ్గి.. రూ. 28,360కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 28,450గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,360గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)