తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Scr Cancelled Trains: ఈ రూట్లలో నడిచే పలు రైళ్లు రద్దు.. వివరాలివే

SCR Cancelled Trains: ఈ రూట్లలో నడిచే పలు రైళ్లు రద్దు.. వివరాలివే

HT Telugu Desk HT Telugu

18 December 2022, 15:09 IST

    •  South Central Railway : దక్షిణ మధ్య రైళ్లు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 
పలు రైళ్లు రద్దు
పలు రైళ్లు రద్దు

పలు రైళ్లు రద్దు

SCR Partial Cancellation of Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. పలుమార్గాల్లో నడిచే రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ట్రాఫిక్ బ్లాక్ కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

AB Venkateswararao : ఏపీ సర్కార్ కు షాక్, ఏబీవీ సస్పెన్షన్ కొట్టివేత-విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశాలు

AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్ కరెక్షన్ విండో ఓపెన్, మే 14 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం

AP Medical Colleges: ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్స్‌, ట్యూటర్‌ పోస్టులు

Bheemili Beach : మనసు దోచేస్తున్న భీమిలి బీచ్- విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!

విజయవాడ - ధర్మవరం (ట్రైన్ నెంబర్ - 17215) రైలును పాక్షికంగా రద్దు చేశారు. అనంతపురం - ధర్మవరం వద్ద ఈ సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 19వ ఈ సేవలు కొనసాగవని పేర్కొన్నారు.

ఇక ధర్మవరం - విజయవాడ (ట్రైన్ నెంబర్ - 17216) రైలు కూడా పాక్షిక రద్దు చేశారు. డిసెంబర్ 20వ తేదీన ధర్మవరం - అనంతపురం రూట్ లో రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - కటక్, కటక్ -సికింద్రాబాద్ మధ్య నడపనుంది. తిరుపతి - సోలాపూర్ మధ్య కూడా స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది.

Secunderabad Cuttack Special Trains: సికింద్రాబాద్ - కటక్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ డిసెంబర్ 23, 30 తేదీల్లో నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు ఆయా తేదీల్లో.. సికింద్రాబాద్ నుంచి రాత్రి 08.30 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు సాయంత్రం 05. 45 నిమిషాలకు కటక్ కు చేరుకుంటుంది.

ఇక కటక్ నుంచి సికింద్రాబాద్ కు కూడా ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైలు... డిసెంబర్ 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఆయా తేదీల్లో కటక్ స్టేషన్ నుంచి రాత్రి 10.30 గంటలకు బయల్దేరి.. మరునాడు రాత్రి 08. 30 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు... కాజీపేట్, వరంగల్, మహబూబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మదిర, ఏలూరు, రాజమండ్రి, సామల్ కోట్, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బరంపూర్, ఖుర్దా, భువనేశ్వర్ స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.