Too Much Calcium : శరీరంలో కాల్షియం ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా?-health problems with too much calcium in human body check in more details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Too Much Calcium : శరీరంలో కాల్షియం ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా?

Too Much Calcium : శరీరంలో కాల్షియం ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా?

Anand Sai HT Telugu

Too Much Calcium Side Effects : మానవ శరీరంలో ఏది ఎక్కువైనా ప్రమాదమే. అలానే కాల్షియం ఎక్కువైతే కూడా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ విషయం గురించి ఇప్పుడు చూద్దాం..

కాల్షియం (Unsplash)

ప్రస్తుత కాలంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనేవి లేవు. ఏది దొరికితే అది తినేయడం అలవాటైపోయింది. పోషకాలను తీసుకోవడం మానేసి మాత్రల రూపంలో పోషకాలను శరీరంలోకి ఎక్కించుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు.. కానీ తప్పడం లేదు. కాల్షియం, ఐరన్ లోపానికి ప్రతిదానికీ ఒక టాబ్లెట్ ఉంది. ఇలా ఎక్కువ కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యకరమేనా?

1000-1200 mg కాల్షియం కలిగిన ఆహారాలలో బ్రోకలీ, టోఫు, మొలాసిస్, నువ్వులు, కొల్లార్డ్ గ్రీన్స్ ఉంటాయి. కాల్షియం ఎక్కువైతే మీ ఎముకలు, దంతాలకు కచ్చితంగా మంచిది కాదు. రక్తంలో ఎక్కువ కాల్షియం అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందని గుర్తించాలి. హైపర్ థైరాయిడిజం, క్యాన్సర్ మొదలైనవి హైపర్ కాల్సెమియాకు కారణమవుతాయి. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు రక్తంలో కాల్షియం పరిమాణం పెరగడం మెుదలవుతుంది. కాల్షియం ఎక్కువైతే వచ్చే సమస్యలు ఏంటో చూద్దాం..

ఓ అధ్యయనం ప్రకారం.. ఎక్కువ కాల్షియం జీవితాన్ని తగ్గిస్తుంది. చాలా మంది బాలికలు తమ 19వ పుట్టినరోజుకు ముందే మరణిస్తున్నారు. కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోవడమే ఇందుకు కారణమని ల్యాబ్ రిపోర్టు చెబుతోంది. ఆహారపు అలవాట్లు, స్మోకింగ్ అలవాట్లు మొదలైనవాటిలో 1400 మి.గ్రా కాల్షియం తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెండింతలు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 40 శాతం మరణాలు కూడా సంభవించవచ్చు. సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని నయం చేయవచ్చు. అనవసరంగా కాల్షియం మాత్రలు వేసుకోవడం మంచిది కాదు.

రక్తంలో కాల్షియం ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రపిండాలు దానిని ఫిల్టర్ చేయడానికి కష్టపడతాయి. ఈ కారణంగా తరచుగా మూత్రవిసర్జన, దాహం వస్తుంది. కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2015లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.., కాల్షియం మాత్రలు మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. కాల్షియం మాత్రలు వేసుకునే రోగులకు కిడ్నీలో రాళ్లు త్వరగా ఏర్పడతాయని తేలింది. విటమిన్ డి తీసుకున్న వారిలో కిడ్నీలో రాళ్ల సంభవం తగ్గినట్లు కూడా కనుగొన్నారు. విటమిన్ డి మాత్రలు కిడ్నీలో రాళ్లను నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

కాల్షియం ఎముకలను దృఢపరచడంలో సహాయపడుతుంది. నరాలు సంకోచం, విశ్రాంతి తీసుకోవడానికి ప్రేరణలను, కండరాలను ప్రసారం చేయడానికి సహాయపడుతుంది. అదనపు కాల్షియం గుండె కండరాలను వేగంగా కొట్టడానికి కారణమవుతుంది. గుండె చప్పుడు సక్రమంగా లేకుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అందుకే మనిషి శరీరానికి ఏది కావాలో అంత వరకే ఉండాలి. కాల్షియం టాబ్లెట్ల రూపంలో కాకుండా ఆహారంలో ఉండేలా చూసుకోండి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.