తెలుగు న్యూస్  /  Telangana  /  Cancellation And Diversion Of Trains Due To Traffic Block In South Central Railway Region

Cancellation of Trains: తెలంగాణ, ఏపీ పరిధిలోని పలు రైళ్లు రద్దు - రూట్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

24 March 2023, 21:41 IST

  • South Central Railway Updates: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో నడుస్తున్న రైళ్లను రద్దు చేసింది. ఇందుకు సంబంధించి తేదీలను వెల్లడించింది. మరికొన్నింటిని దారిమళ్లించింది.

పలు రైళ్లు రద్దు
పలు రైళ్లు రద్దు

పలు రైళ్లు రద్దు

South Central Railway Cancelled Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. పలుమార్గాల్లో నడిచే రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. మరమ్మత్తు పనుల కారణంగా వీటిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరికొన్ని రూట్లలో నడిచే రైళ్లను దారి మళ్లించింది. ఆయా వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sangareddy Crime : సంగారెడ్డిలో దారుణం, ఓ వ్యక్తిని హత్య చేసి పొలంలో పడేసిన దుండగులు

TS SSC Supplementary Exams: రీ కౌంటింగ్ ఫలితాల కోసం ఆగొద్దు.. సప్లిమెంటరీకి అప్లై చేయాలని బోర్డు సూచన…

TS SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల.. 91శాతం ఉత్తీర్ణత, గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు

TS 10th Results 2024: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

రద్దు అయిన రైళ్లు…

డాండ్ - నిజామాబాద్ (ట్రైన్ నెంబర్ 11409 ) మధ్య నడిచే రైలును అధికారులు రద్దు చేశారు. మార్చి 30వ తేదీన ఈ సర్వీస్ అందుబాటులో ఉండదు. నిజామాబాద్ - పూణె(ట్రైన్ నెంబర్ 11410) మధ్య నడిచే రైలును ఏప్రిల్ 1వ తేదీన రద్దు చేశారు. నాందేడ్ - పూణె(ట్రైన్ నెంబర్ 17630) మధ్య నడిచే రైలును…మార్చి 28వ తేదీన రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పూణె - నాందేడ్ (ట్రైన్ నెంబర్ 17629) మధ్య నడిచే రైలును మార్చి 29వ తేదీన రద్దు చేశారు. బెంగళూరు - న్యూ ఢిల్లీ మధ్య నడిచే రైలును… దారి మళ్లించారు. మార్చి 28వ తేదీన పూణె- లోనవాలా- వాసయి రోడ్డు - వడోదర - రట్లం మీదుగా వెళ్తుంది. హౌరా - పూణె మధ్య నడిచే రైలును మార్చి 27వ తేదీన నాగ్ పూర్, బలార్షా, సికింద్రాబాద్, వాడి, డాండ్, పూణె మీదుగా మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. హఠియా - పూణె మధ్య నడిచే రైలును మార్చి 27వ తేదీన నాగ్ పూర్, బలార్షా, సికింద్రాబాద్, వాడి, డాండ్, పూణె మీదుగా మళ్లించారు.

ఏపీ పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. విజయవాడ - గుంటూరు (ట్రైన్ నెంబర్ 07464), గుంటూరు - విజయవాడ(ట్రైన్ 07465), విజయవాడ - గుంటూరు (ట్రైన్ నెంబర్ 07628) మధ్య నడిచే రైళ్లను… మార్చి 25 నుంచి మార్చి 26వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు - రేపల్లె మధ్య నడిచే రైలు(ట్రైన్ 07786)ను గుంటూరు - తెనాలి మధ్య పాక్షికంగా రద్దు చేశారు. నర్సాపూర్ - గుంటూరు (ట్రైన్ నెంబర్ 17282) మధ్య నడిచే రైలును దారి మళ్లించారు. మార్చి, 25, 26వ తేదీల్లో తెనాలి మీదుగా మళ్లించారు.

సమ్మర్ ట్రైన్స్.. వివరాలు

వేసవి దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు వివరాలను పేర్కొన్న సంగతి తెలిసిందే. తిరుపతి - అకోలా, అకోలా - తిరుపతి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది మార్చి 3 నుంచి మే 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇక అకోలా - తిరుపతి రూట్ లో నడిచే రైలును కూడా... మార్చి 19 నుంచి మే 28వ తేదీ వరకు పొడిగించారు. తిరుపతి - పూర్ణ, పూర్ణ - తిరుపతి మధ్య ప్రవేశపెట్టిన స్పెషల్ ట్రైన్స్ ను కూడా మార్చి 3 నుంచి మే 30వ తేదీ వరకు నడపనున్నారు. హైదరాబాద్ - నర్సాపూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును... మార్చి 18వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు పొడిగించగా... నర్సాపూర్ - హైదరాబాద్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్ ను మార్చి 19వ తేదీ నుంచి మే 28 తేదీ వరకు పొడిగించారు. హైదరాబాద్ - తిరుపతి, తిరుపతి - హైదరాబాద్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్స్ ను కూడా పొడిగించారు అధికారులు. మార్చి 30వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు నడపనున్నారు.విజయవాడ- నాగర్ సోల్, నాగర్ సోల్ - విజయవాడ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను కూడా పొడిగించారు.