Traffic accidents in India : ట్రాఫిక్ ప్రమాదాలకు 1.73లక్షల మంది బలి
29 August 2022, 21:30 IST
Traffic accidents in India : 2021లో దేశంలో జరిగిన ట్రాఫిక్ ప్రమాదాలకు 1.73లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ డేటాను ఎన్సీఆర్బీ వెల్లడించింది.
ట్రాఫిక్ ప్రమాదాలకు 1.73లక్షల మంది బలి
Traffic accidents in India : దేశంలో ట్రాఫిక్ ప్రమాదాలు ఆందోళనకరంగా మారాయి. 2021లో మొత్తం మీద 4.22లక్షల ట్రాఫిక్ ప్రమాదాలు జరగ్గా.. వాటిల్లో 1.73లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్ప్రదేశ్లో అత్యధికంగా 24,711 మంది ట్రాఫిక్ ప్రమాదాలకు బలి అయ్యారు. ఈ వ్యవహారంలో 16,685 మరణాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది.
దేశంలో ట్రాఫిక్ ప్రమాదాలపై ఓ నివేదికను బయటపెట్టింది ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో). 2020తో పోల్చుకుంటే 2021లో ట్రాఫిక్ ప్రమాదాలు పెరిగాయి. 2020లో 3,68,828గా ఉన్న ప్రమాదాల సంఖ్య.. 2021లో 4,22,659కి చేరింది.
ఈ మొత్తం ట్రాఫిక్ ప్రమాదాల్లో.. 4,03,116 రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి. 17,993 రైల్వే ప్రమాదాలు, 1,550 రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఆయా ఘటనల్లో వరుసగా 1,55,622- 16,431- 1,807 మంది మరణించారు.
Traffic accident death toll : ట్రాఫిక్ ప్రమాదాలు పెరిగిన రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది(2020లో 46,443- 2021లో 57,090). మధ్యప్రదేశ్(43,360-49,493), ఉత్తర్ప్రదేశ్(30,593-36,509), మహారాష్ట్ర(24,908- 30,086).. తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ట్రాఫిక్ ప్రమాదాల్లో మొత్తం మీద 3,73,884 మంది గాయపడ్డారు.
మొత్తం మీద 2021లో జరిగిన ట్రాఫిక్ ప్రమాదాల్లో ఉత్తర్ప్రదేశ్ వాటా 14.2శాతం, తమిళనాడు వాటా 9.6శాతం, మహారాష్ట్రలో 9.5శాతంగా ఉంది.
2017 నుంచి 2019 వరకు విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ ప్రమాదాల మరణాలు.. 2020లో అనూహ్యంగా తగ్గిపోయాయి. కానీ 2021లో మళ్లీ పెరిగాయి.
Traffic accidents : కాగా.. అనేక రాష్ట్రాల్లో ట్రాఫిక్ ప్రమాదాల వల్ల మరణాల కన్నా గాయపడిన వారే ఎక్కువమంది ఉన్నారు. కానీ మిజోరాం, పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్లో గాయపడిన వారి కన్నా మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.
మిజోరాంలో 64 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 64మంది మరణించారు, 28మంది గాయపడ్డారు. పంజాబ్లో 6,097 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 4,516మంది మరణిస్తే, 3,034మంది గాయపడ్డారు. ఝార్ఖండ్లో 4,728 రోడ్డు ప్రమాదాల్లో 3,513మంది ప్రాణాలు కోల్పోగా.. 3,227మంది గాయపడ్డారు.