Stock market today : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 100పాయింట్లు డౌన్
01 July 2022, 9:22 IST
- Stock market today : దేశీయ సూచీలు నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఇక అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
స్టాక్ మార్కెట్
Stock market today : ఇండియా స్టాక్ మర్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 319పాయింట్ల నష్టంతో 52,7000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 104పాయింట్లు కోల్పోయి 15677 వద్ద కొనసాగుతోంది.
జూన్ నెలలను నష్టంతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. గురువారం ట్రేడింగ్ సెషన్లో 8పాయింటలు కోల్పోయి 53,019 వద్ద ముగిసింది సెన్సెక్స్. 19పాయింటల నష్టంతో 15,780 వద్ద నిఫ్టీ50 స్థిరపడింది. ఇక జులై నెలను సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 52,863- 15,704 వద్ద ప్రారంభించాయి.
లాభాలు.. నష్టాలు..
టెక్ఎం, విప్రో, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టైటాన్, డా. రెడ్డీస్, ఎం అండ్ ఎం, మారుతీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికాన్ని నష్టాల్లో ముగించాయి అమెరికా స్టాక్ మార్కెట్లు. ముఖ్యంగా ఈ త్రైమాసికంలో ఎస్ అండ్ పీ 500.. 50ఏళ్లలోనే తొలిసారి దారుణ ప్రదర్శన చేసింది. డౌ జోన్స్ 0.82శాతం పతనమైంది. నాస్డాక్ 1.33శాతం, ఎస్ అండ్ పీ 500 0.8శాతం మేర పడ్డాయి.
(భారత్లో ఆర్థిక ఏడాది జూన్ నుంచి మొదలవుతుంది. కాగా అమెరికాలో ఆర్థిక ఏడాది జనవరి నుంచే ప్రారంభమవుతుంది.)
ఆసియా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. చైనా ఫ్యాక్టరీ ఔట్పుట్ పాజిటివ్గా ఉంటుందన్న అంచనాలు సానుకూలంగా మారాయి. జపాన్ నిక్కీ 0.37శాతం వృద్ధి చెందింది. సౌత్ కొరియా కాస్పి 0.67శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 200 0.59శాతం వృద్ధి చెందింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మార్కెట్లో ఎఫ్ఐఐల అమ్మకాల జోరు కొనసాగుతోంది. విక్రయాలవైపు ఎఫ్ఐఐలు మళ్లి.. తొమ్మిది నెలలు గడిచిపోయింది. ఇండియా స్టాక్ మార్కెట్లో.. ఎఫ్ఐఐలు అమ్మకాలవైపు ఇంత కాలం ఉండటం ఇదే తొలిసారి. ఎఫ్ఐఐలు ఒత్తడి నుంచి మార్కెట్లను కాపాడేందుకు డీఐఐలు కొనుగోళ్లు చేస్తున్నా.. వారి బలం సరిపోవడం లేదు. ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్లు 15శాతం మేర పతనమయ్యాయి.
మరికొంత కాలం ఇదే కొనసాగవచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్లో రూ. 1,138.05కోట్లు విలువ చేసే షేర్లను ఎఫ్ఐఐలు విక్రయించారు. మరోవైపు డీఐలు రూ. 1,378.20కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.