Nirmala Sitharaman hospitalised : ఆసుపత్రిలో చేరిన నిర్మలా సీతారామన్
26 December 2022, 16:21 IST
Nirmala Sitharaman admitted to Delhi AIIMS : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు.
నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman admitted to hospital : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ఉదర సంబంధిత స్వల్ప ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరారు. అలాగే సాధారణ వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
మరికొన్ని గంటల్లో డిశ్చార్జ్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మరికొన్ని గంటల్లో ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అవుతారని సమాచారం. వైద్య పరీక్షల తర్వాత ఆమె బయటికి వస్తారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఆమెకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని, సమస్య ఏం లేదని వెల్లడించాయి.
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్మలా సీతారామన్ను ఆసుపత్రికి తరలించినట్టు, ఆమెను ప్రైవేటు వార్డులో చేర్చినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.