తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gold Rates Today : స్థిరంగా బంగారం ధరలు.. నేటి లెక్కలివే!

Gold rates today : స్థిరంగా బంగారం ధరలు.. నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu

27 September 2022, 6:15 IST

    • Gold rates today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..

Gold rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 46,000గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4,60,000గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Covid vaccine: సేఫ్టీ ఇష్యూస్ కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకోనున్న ఆస్ట్రాజెనెకా

Haryana: హరియాణాలో సంక్షోభంలో బీజేపీ సర్కారు; అసెంబ్లీలో మారిన సంఖ్యాబలం

US crime news: ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ - మూడేళ్ల కొడుకును షూట్ చేసి చంపేసిన కర్కశ తల్లి

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా ఉంది. ప్రస్తుతం ధర రూ. 50,200గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర ఉంది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,02,000గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,350గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 50,200గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,510గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,740ను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 46,030గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,230గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,230గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,050గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,240గాను కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,200గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా మంగళవారం స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,630గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 56,300గా కొనసాగుతోంది. సోమవారం కూడా ధర ఇంతే ఉంది.

Silver rate in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 60,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 56,300.. బెంగళూరులో రూ. 60,700గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం కాస్త పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 310 పెరిగి.. రూ 22,620కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 22,310గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 22,620గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)