తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Euro Zone Inflation Soars: యూరో జోన్‌లో ధరల మంట.. 10.7 శాతానికి ద్రవ్యోల్భణం

Euro zone inflation soars: యూరో జోన్‌లో ధరల మంట.. 10.7 శాతానికి ద్రవ్యోల్భణం

HT Telugu Desk HT Telugu

31 October 2022, 16:04 IST

  • Euro zone inflation soars: యూరో జోన్‌లో ద్రవ్యోల్భణం కొత్త గరిష్టాలకు చేరుకుంది.

యూరో జోన్‌లో ధరల మంట (ఫైల్ ఫోటో)
యూరో జోన్‌లో ధరల మంట (ఫైల్ ఫోటో) (AFP)

యూరో జోన్‌లో ధరల మంట (ఫైల్ ఫోటో)

Euro zone inflation soars: యూరో జోన్‌లో ద్రవ్యోల్భణం సరికొత్త గరిష్ట స్థాయిలకు చేరుకుంది. యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లు పెంచకతప్పదని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

యూరో చలామణిలో ఉన్న 19 దేశాల్లో వినియోగ ధరల వృద్ధి సెప్టెంబరులో 9.9 శాతం ఉండగా.. అక్టోబరు మాసంలో అది 10.7 శాతానికి పెరిగింది. రాయిటర్స్ పోల్‌లో వెల్లడైన అంచనాలు 10.2 శాతం ఉండగా, ఈ పోల్ అంచనాలను కూడా అధిగమించి ద్రవ్యోల్భణం రికార్డుస్థాయికి చేరుకుంది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో అంచనాలను మించి ద్రవ్యోల్భణం నమోదైందని సోమవారం వెల్లడైన యూరో స్టాట్ డేటా ద్వారా అర్థమవుతోంది.

ఇంధన ధరలు పైపైకి పెరుగుతూ అధిక ద్రవ్యోల్భణానికి కారణమైంది. ఇక ఆహారం, ఇండస్ట్రియల్ గూడ్స్ దిగుమతులు ధరలు ఎక్కువగా పెరగడానికి కారణమయ్యాయి. ద్రవ్యోల్భణం పెరగడంలో సేవా రంగం పాత్ర ఈసారి నామమాత్రంగా ఉంది.

గడిచిన మూడు నెలల్లో యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) 200 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది. డిసెంబరులోగా మరోసారి వడ్డీ రేట్లు పెంచే సంకేతాలు ఇచ్చింది. అయితే రేట్ల పెంపు నెమ్మదించవచ్చని మార్కెట్లు ఆశిస్తూ వచ్చాయి. గ్యాస్ ధరలు రికార్డు స్థాయి నుంచి తగ్గడం కూడా మార్కెట్ల ఆలోచనకు దోహదం చేశాయి.

కానీ ఆహారం, ఇంధన ధరల్లో అనిశ్చితి కారణంగా ధరల పెరుగుదలలో వృద్ధి ఉంటుందని విధాన రూపకర్తలు ఆందోళన చెందుతున్నారు.

నిజానికి ప్రాసెస్ చేయని ఫుడ్, ఇంధనం ధరలను మినహాయిస్తే ద్రవ్యోల్భణం 6.0 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది. ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులను మినహాయిస్తే అది 4.8 శాతం నుంచి 5.0 శాతానికి మాత్రమే పెరిగింది.