తెలుగు న్యూస్  /  Entertainment  /  Vignesh Sivan Responded On Nayantharas Tirumala Controversy

Nayanthara: నయనతార తిరుమల వివాదంపై స్పందించిన విగ్నేష్‌ శివన్‌

Hari Prasad S HT Telugu

11 June 2022, 11:01 IST

    • పెళ్లి చేసుకుందో లేదో ఓ కొత్త వివాదంలో చిక్కుకుంది నయనతార. పెళ్లి తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆమె.. మాఢవీధుల్లో చెప్పులతో తిరగడం వివాదానికి కారణమైంది.
తిరుమలలో నయనతార, విగ్నేష్ జోడీ
తిరుమలలో నయనతార, విగ్నేష్ జోడీ (Twitter)

తిరుమలలో నయనతార, విగ్నేష్ జోడీ

ఏడేళ్లుగా డైరెక్టర్‌ విగ్నేష్‌ శివన్‌తో డేటింగ్‌లో ఉన్న నయనతార ఈ నెల 9న అతన్ని పెళ్లి చేసుకుంది. మరుసటి రోజు అంటే శుక్రవారం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చింది. అయితే పరమ పవిత్రమైన మాఢవీధుల్లో ఆమె చెప్పులతో తిరగడంపై వివాదం రేగింది. దీనిపై టీటీడీ కూడా తీవ్రంగానే స్పందించింది. ఆమెపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పింది.

నయనతార చుట్టూ ఉన్న వాళ్లంతా చెప్పుల్లేకుండానే తిరిగారు. కానీ నయన్‌ మాత్రమే చెప్పులతో తిరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. పైగా మాఢవీధుల్లో ఫొటోషూట్‌లు చేయడం కూడా నిషేధమని తెలిసినా.. భర్తతో కలిసి ఆమె ఫొటోలకు పోజులిచ్చింది. దీనిపై వివరణ కోరుతూ ఇప్పటికే టీటీడీ అధికారులు ఈ సెలబ్రిటీ జోడీకి నోటీసులు జారీ చేసింది.

అయితే తాజాగా ఈ వివాదంపై నయన్‌ భర్త విగ్నేష్‌ స్పందించాడు. దీనిపై అతడు క్షమాపణ చెప్పాడు. "వెంకటేశ్వరునికి మేము పరమ భక్తులం. నేను, నయనతార తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ మహాబలిపురానికి మార్చాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత మేము తిరుమలకు వచ్చాము. జీవితంలో మరచిపోలేని ఈ సందర్భం కోసం ఫొటోలు తీసుకున్నాం. అయితే మేము తొందర్లో చెప్పులు బయట విడిచిపెట్టడం మరచిపోయాం. గత నెల రోజుల్లోనే నేను, నయనతారు ఐదుసార్లు తిరుమలకు వచ్చాము. జరిగిన పొరపాటుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాము" అని విగ్నేష్‌ తన ప్రకటనలో చెప్పాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.