Nayanthara-Vignesh Wedding: భర్తకు 20 కోట్ల బంగ్లాను కానుకగా ఇచ్చిన నయన్
10 June 2022, 18:29 IST
- నయతార-విఘ్నేశ్ శివన్ వివాహం గురువారం జరిగిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం నయన్.. విఘ్నేశ్కు 20 కోట్ల విలువ చేసే బంగ్లాను బహుమతిగా ఇచ్చిందట.
నయనతార-విఘ్నేశ్ శివన్
కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార-విఘ్నేశ్ శివన్ గురువారం వివాహంతో ఒక్కటైన విషయం తెలిసందే. వీరి పెళ్లి మహాబలిపురంలోని ఓ ఐదు స్టార్ల హోటెల్లో అంగరంగవైభవంగా జరిగింది. వివాహం తర్వాత విఘ్నేశ్ తమ పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ఈ వేడుక బంధువువలు, సన్నిహితులు, అతికొద్దిమంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం నయనతార.. విఘ్నేశ్కు ఖరీదైన బహుమతిని ఇచ్చిందట.
తన భర్తకు 20 కోట్లు విలువ చేసే ఖరీదైన బంగ్లాను బహకరించిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గ్రేప్ వైన్ అనే బంగ్లాను విఘ్నేశ్ పేరిట నయన్ రహస్యంగా రిజిస్టర్ చేసిందట. అంతేకాకుండా అతడి పేరుతో బంగ్లాను రిజిస్టర్ చేసేందుకుగాను డాక్యూమెంటేషన్ పనులను పెళ్లికి ముందే పూర్తి చేసిందట. వివాహం సమయంలో డాక్యూమెంట్లను విఘ్నేశ్కు బహుకరించి అతడిని సర్ప్రైజ్ చేసిందట.
ఈ బంగ్లానే కాకుండా.. విఘ్నేశ్ సోదరికి 24 తులాల బంగారాన్ని ఇచ్చిందట. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం ఆడపడచుకు ఇచ్చే లాంఛానాలను ఈ రూపంలో కానుకగా ఇచ్చిందట. 2015 నుంచి విఘ్నేశ్-నయనతార ప్రేమలో మునిగిపోయారు. ఎట్టకేలకు పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు.
అయితే మరోపక్క విఘ్నేశ్ శివన్ కూడా నయనతారకు ఖరీదైన కానుకలు బహుకరించాడట. ఆమెకు దాదాపు 5 కోట్లు విలువ చేసే డైమండ్ రింగును ఇచ్చాడు. అంతేకాకుండా 2-3 కోట్ల విలువ చేసే విలువైన ఆభరణాలను బహుకరించినట్లు సమాచారం. పెళ్లి రోజున నయన్ ధరించిన ఆభరణాలు విఘ్నేశ్ ఇచ్చినవేనట.
టాపిక్