తెలుగు న్యూస్  /  Entertainment  /  Sai Pallavi On Metoo Movement Says This On Sonyliv Show Nijam

Sai Pallavi on MeToo movement: మీటూ ఉద్యమంపై సాయి పల్లవి సంచలన కామెంట్స్

Hari Prasad S HT Telugu

09 March 2023, 16:59 IST

    • Sai Pallavi on MeToo movement: మీటూ ఉద్యమంపై సాయి పల్లవి సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఆమె సోనీలివ్ ఓటీటీలో వస్తున్న నిజం అనే షోలో సింగర్ స్మితతో మాట్లాడింది.
సాయి పల్లవి
సాయి పల్లవి

సాయి పల్లవి

Sai Pallavi on MeToo movement: మీటూ ఉద్యమం గురించి తెలుసు కదా. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది. హాలీవుడ్ నిర్మాత వైన్‌స్టీన్ తమను ఎలా వేధించాడో చెబుతూ కొందరు నటీమణులు బయటకు రావడంతో ఈ మీటూ ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత వివిధ సినిమా ఇండస్ట్రీల్లో నిర్మాతలు, దర్శకులు, హీరోల చేతుల్లో లైంగిక వేధింపులకు గురైన మహిళలంతా బయటకు వచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Lineman OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కామెడీ మూవీ.. అక్కడ స్ట్రీమింగ్.. కానీ, చిన్న ట్విస్ట్

Brahmamudi: అనామిక పేరెంట్స్‌ను బెదిరించిన కావ్య- న్యాయం చేయమంటూ నట్టింట్లో కూర్చున్న కనకం- ముకుందతోనే మురారికి బిడ్డ

Jathi Ratnalu 2: జాతి రత్నాలు 2 అప్పుడే! అప్డేట్ ఇచ్చిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్

Premikudu Re Release: ప్రభుదేవా బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమికుడు రీ రిలీజ్.. 30 ఏళ్లకు మళ్లీ.. 300కుపైగా థియేటర్లలో!

ఇక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నటి సాయి పల్లవి కూడా ఈ మీటూ ఉద్యమంపై నోరు విప్పింది. సోనీలివ్ ఓటీటీలో సింగర్ స్మిత హోస్ట్ చేస్తున్న నిజం అనే షోకు గెస్ట్ గా వచ్చిన సాయిపల్లవి ఈ మీటూ ఉద్యమంపై స్పందించింది. శారీరకంగా హింసించడమే కాదు.. మాటల ద్వారా హింసించడాన్ని కూడా తేలిగ్గా తీసుకోకూడదని ఆమె అనడం విశేషం.

ఈ టాక్ షో పూర్తి ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమ్ అవనుంది. అయితే దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో సాయి పల్లవి ఈ మీటూ ఉద్యమం గురించి మాట్లాడింది. "శారీరకంగా హింసించాల్సిన అవసరం లేదు. మాటల ద్వారా హింసించడం, వారిని ఇబ్బంది పెట్టడం కూడా ఓ రకంగా దీని కిందకే వస్తుంది" అని సాయి పల్లవి చెప్పింది.

ఇక ఇదే షోలో ఓ మెడికల్ స్టూడెంట్ నుంచి నటిగా మారిన తన ప్రయాణం గురించి కూడా సాయి పల్లవి మాట్లాడింది. అంతేకాదు ఆమె ఓ మంచి డ్యాన్స్ అన్న విషయం తెలుసు కదా. అందుకే టాలీవుడ్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో ఎవరితో కలిసి డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నావ్ అని సాయి పల్లవిని స్మిత్ అడిగింది.

దీనికి ఆమె మొదట ఆడియెన్స్ వైపు చూసి ఎవరి పేరు చెప్పమంటారు అన్నట్లుగా అడిగింది. ఆ తర్వాత ముగ్గురూ తనతో కలిసి ఒక పాటలో డ్యాన్స్ చేస్తే బాగుంటుందని చెప్పడం విశేషం. నిజం షోలో ఇది ఐదో ఎపిసోడ్. ఇప్పటికే చిరంజీవి, చంద్రబాబు నాయుడు, నాని, రానాలాంటి వాళ్లు ఈ షోకు గెస్టులుగా వచ్చారు. ఇప్పుడీ సాయిపల్లవి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.