తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Birthday Cdp: చరణ్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్

Ram Charan Birthday CDP: చరణ్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్

24 March 2023, 21:27 IST

  • Ram Charan Birthday CDP: రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న జరగనుంది. ఈ నేపథ్యంలో అతడి కామన్ డిస్ ప్లే పోస్టర్‌ను అభిమానులు విడుదల చేశారు. అల్లూరి గెటప్పులో చరణ్ అదరగొట్టారు.

రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్
రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్

రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్

Ram Charan Birthday CDP: ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఈ సందర్భంగా అతడు ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవలే ఆస్కార్ వేడుకల్లో పాల్గొని హైదరాబాద్‌కు చేరుకున్న చరణ్ తన తదుపరి చిత్రాల షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు దగ్గరపడుతుండటంతో అభిమానులు ముందుగానే అతడికి అద్భుతమైన బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. కామన్ డిస్‌ప్లే పోస్ట్(CDP)ని విడుదల చేశారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాదికి చరణ్ పుట్టిన రోజు వైభవంగా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆర్ఆర్ఆర్ విజయంతో ఈ ఏడాది మరింత ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

మెగా హీరో వరుణ్ తేజ్.. చరణ్ కామన్ డిస్ ప్లే పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. అల్లూరి గెటప్‌లో గంభీరంగా ఉన్న చరణ్ లుక్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది. "గ్లోబల్ స్టార్ మా అన్నయ్య సీడీపీని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. వినయం, హార్డ్ వర్క్‌తో ఆయన మాలో ఎప్పుడూ స్ఫూర్తినింపుతుంటారు. లవ్ యూ అన్న" అని ట్విటర్ వేదికగా తెలియజేశారు.

ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. RC15గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా చేస్తుండగా.. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చెర్రీతో కియారాకు ఇది రెండో సినిమా. ఇంతకుముందు వినయ విధేయ రామలో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.

రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్ వస్తోన్న ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇది కాకుండా బుచ్చిబాబు సానం దర్శకత్వంలో ఇప్పటికే ఓ సినిమాకు సంతకం చేశారు చరణ్.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.