తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas And Maruthi Movie Update: మారుతీతో ప్రభాస్ మూవీ ప్రారంభమయ్యేది ఆ రోజు నుంచేనా?

Prabhas and Maruthi Movie Update: మారుతీతో ప్రభాస్ మూవీ ప్రారంభమయ్యేది ఆ రోజు నుంచేనా?

21 October 2022, 14:45 IST

    • Prabhas and Maruthi Movie Update: డార్లింగ్ ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ మారుతీతో చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. తాజాగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ శనివారం నుంచి ప్రారంభం కాబోతుంది.
ప్రభాస్
ప్రభాస్ (HT_PRINT)

ప్రభాస్

Prabhas and Maruthi Movie Update: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన మన డార్లింగ్.. ఆ సినిమాపై మిక్స్‌డ్ టాక్ రావడంతో తన ఆశలంతా ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్‌పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల కాగా.. సర్వత్ర మిశ్రమ స్పందనల వ్యక్తమయ్యాయి. దీంతో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం టాలీవుడ్ విలక్షణ దర్శకుడు మారుతీతో ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

ప్రభాస్ బర్త్ డే(అక్టోబరు 23) సందర్భంగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారట. అతడి పుట్టిన రోజుకు ఒక నాడు ముందే అంటే అక్టోబరు 22 నుంచి మారుతీ చిత్రం పట్టాలెక్కబోతుందని సమాచారం. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించి చిన్నపాటి షెడ్యూల్‌ జరగనుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ నెలకు ఏడు రోజుల కాల్షీట్లు కేటాయించనున్నారట. అలా సినిమా అయ్యే వరకు నెలకు ఏడు రోజులు మాత్రమే డార్లింగ్.. మారుతీ చిత్రంలో పాల్గొనబోతున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం.

మారుతీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ నటించిన సలార్ తర్వాత థియేటర్లలో విడుదల కాబోతుంది. ఓ పక్క వరుస సినిమాలతో డార్లింగ్ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ మారుతీ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమాను పట్టాలెక్కించారు. అందుకోసం మారుతీకి అవసరమైన సహాయ, సాకారాలను అందించనున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మించబోతున్నారు. ఇందులో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలిసింది. వీరు ఎవరన్నది త్వరలోనే స్పష్టత రానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.