తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jacqueline Fernandez |జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు షాక్..ఆస్తులు జప్తు చేసిన ఈడీ..

Jacqueline Fernandez |జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు షాక్..ఆస్తులు జప్తు చేసిన ఈడీ..

HT Telugu Desk HT Telugu

30 April 2022, 14:30 IST

  • సుకేష్ చంద్రశేఖర్ అక్రమార్జన కేసుతో సంబంధం ఉన్నట్లుగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆరోపణలను ఎదుర్కొంటోంది. తాజాగా ఆమెకు చెందిన 7.27 కోట్ల రూపాయల్ని ఈడీ అధికారులు జప్తు చేశారు
జాక్వెలిన్ ఫెర్నాండేజ్
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (twitter)

జాక్వెలిన్ ఫెర్నాండేజ్

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆమెకు చెందిన 7.27 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.  అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడనే నేరంపై సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఈడీ అధికారులు గత ఏడాది అరెస్ట్ చేశారు. 

ట్రెండింగ్ వార్తలు

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

సుకేష్ నేరాలపై ఆరా తీయగా అతడికి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గా  వెల్లడైంది. తాను దోచుకున్న డబ్బులతో జాక్వెలిన్ కు అతడు 5.70 కోట్ల ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు ఈడీ పరిశోధనలో తేలింది. జాక్వెలిన్ తో పాటు ఆమె కుటుంబసభ్యులకు సుకేష్ భారీగా నగదు ఇచ్చినట్లు తెలిసింది. 

ఈ అక్రమార్జన కేసులో పలుమార్లు జాక్వెలిన్ ను ఈడీ అధికారులు విచారించారు. తాజాగా జాక్వెలిన్ కు చెందిన పన్నెండు కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లను జప్తు చేయడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. వ్యాపారవేత్తలు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ లను చీటింగ్ చేసి 200 కోట్లను సుకేష్ దోచుకున్నాడు. రాజకీయ నాయకుడు దినకరన్ మోసం చేసిన కేసులో సుకేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.