తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Waltair Veerayya First Single Promo Released

Waltair Veerayya First Single Promo: బాస్ వస్తుండు.. ఎప్పుడంటే? వాల్తేరు వీరయ్య నుంచి మొదటి పాట

22 November 2022, 12:24 IST

    • Waltair Veerayya First Single Promo: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా నుంచి మొదటి పాట ప్రోమో విడుదలైంది. పూర్తి పాట నవంబరు 23న రానుంది.
వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ ప్రోమో
వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ ప్రోమో

వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ ప్రోమో

Waltair Veerayya First Single Promo: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఆయన ఈ ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో సందడి చేశారు. ఇందులో ఆచార్య బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా.. గాడ్‌ఫాదర్ మాత్రం అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే వరుసలో ఆయన నటిస్తోన్న మరో చిత్రం వాల్తేరు వీరయ్య. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌తో సినిమా అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమా మరో సరికొత్త అప్డేట్ వచ్చింది. వాల్తేరు వీరయ్య నుంచి తొలి పాటకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. తాజాగా ఈ పాట ప్రోమోను విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Pradeep Ranganathan: లవ్ టుడే కాంబో రిపీట్.. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కొత్త మూవీ.. మరి డైరెక్టర్ ఎవరంటే?

Pawan Kalyan Hhvm Teaser: దొంగ దొర‌ల లెక్క‌ల‌ను స‌రిచేసే యోధుడు - ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు టీజ‌ర్ రిలీజ్‌

OTT: ఓటీటీలోకి 3 రోజుల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Krishna mukunda murari may 2nd:మీరాని అనుమానించిన మురారి.. భవానీ ఆనందాన్ని చెడగొట్టిన ముకుంద

వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ పూర్తి పాటను నవంబరు 23న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నారు. మేకర్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాలో హైలెట్ కానుంది. బాస్ పార్టీ పేరుతో రానున్న ఈ సాంగ్ మాస్ నెంబర్ మాదిరిగా కనిపిస్తోంది. ఈ ప్రోమోను పరిశీలిస్తే.. బాస్ వస్తుండు అంటూ దేవిశ్రీ ఆలపించడం.. మరో షాట్‌లో మెగాస్టార్ లుంగీ కట్టుకుని వస్తుండటంతో పాటపై ఆసక్తి రేగుతుంది.

మెగాస్టార్ లాంటి మాస్ హీరోకు సరైన పాట పడిందని విడుదల కాక ముందే ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను నకాశ్ అజీజ్, డీఎస్‌పీ, హరిప్రియ ఆలపించారు. స్వరాలే కాకుండా ఈ సాంగ్‌కు సాహిత్యాన్ని కూడా దేవిశ్రీనే అందించడం మరో విశేషం. పక్క మాస్ సింగిల్‌గా రానున్న ఈ పాట సూపర్ హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు.

బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కేథరిన్ తెరీసా మరో హీరోయిన్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.