తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan And Buchibabu Movie: బుచ్చిబాబుతో ఎన్టీఆర్ మూవీ క్యాన్సిల్ అయిందా? రేసులోకి రామ్ చరణ్..!

Ram charan and Buchibabu Movie: బుచ్చిబాబుతో ఎన్టీఆర్ మూవీ క్యాన్సిల్ అయిందా? రేసులోకి రామ్ చరణ్..!

22 November 2022, 11:06 IST

    • Ram charan and Buchibabu Movie: ఉప్పెన దర్శకుడితో జూనియర్ ఎన్టీఆర్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆ కథను రామ్ చరణ్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది.
బుచ్చిబాబుతో రామ్ చరణ్ సినిమా
బుచ్చిబాబుతో రామ్ చరణ్ సినిమా

బుచ్చిబాబుతో రామ్ చరణ్ సినిమా

Ram charan and Buchibabu Movie: యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ చిత్రాలు మినహా ఏ సినిమాలను ఆయన ప్రకటించనే లేదు. అయితే ఈ రెండు చిత్రాలు పట్టాలెక్కలేదు. ప్రస్తుతం కొరటాల చిత్రం ప్ర్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఆయన గతంలో త్రివిక్రమ్‌తో ఓ సినిమా ఒప్పుకుని తర్వాత దాన్ని రద్దు చేశారు. అనంతరం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమాకు ఓకే చెప్పారు. తాజాగా ఈ కాంబో కూడా రూపు దాల్చే పరిస్థితి కనిపించడం లేదు. త్రివిక్రమ్ సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా క్యాన్సిల్ అయినట్లు ఫిల్మ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

కొరటాల శివతో తెరెకక్కిస్తున్న సినిమాపై తారక్ దృష్టి పెట్టడం, ఆ సినిమా ఇంకా ఆలస్యం కావడం వల్ల బుచ్చిబాబు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు తయారు చేసిన కథను.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో తెరకెక్కించనున్నారని సమాచారం. తారక్‌కు చెప్పిన కథే చరణ్ కూడా ఒకే చెప్పడంతో బుచ్చిబాబుతో ప్రాజెక్టుకు లైన్ క్లియరైనట్లు తెలుస్తోంది.

హీరోనే కాదు.. ఈ సినిమాకు నిర్మాత కూడా మారినట్లు సమాచారం. బుచ్చిబాబు-తారక్ కాంబోను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నట్లు ప్రకటించగా.. అదే కథను రామ్ చరణ్‌తో మాత్రం మరో నిర్మాత నిర్మించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్‌కు సన్నిహితులైన సతీశ్ కిలారు ఈ సినిమాను రూపొందించనున్నారట. మైత్రీ సంస్థతో సన్నిహత సంబంధాల కారణంగా.. సతీశ్ కిలారుకు ఈ సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు తెరకెక్కించే ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో రానున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందించనున్నారట.

ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ చిత్రం కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు తగినట్లుగా తన రూపాన్ని పూర్తిగా మార్చోకుంటున్నారు. ఈ సినిమా ప్రకటన ఎప్పుడో రాగా.. స్క్రిప్టులో సవరణల సూచించడంతో ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇది కాకుండా ప్రశాంత్ నీల్‌తోనూ ఓ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు తారక్. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.