Pm Modi Congratulates Chiranjeevi: చిరంజీవి విలక్షణ నటుడు - మెగాస్టార్పై మోదీ ప్రశంసలు
Pm Modi Congratulates Chiranjeevi: ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. విభిన్న నటనాచాతుర్యంతో అనేక తరాల ప్రేక్షకుల అభిమానాన్ని చిరంజీవి చూరగొన్నారని మోదీ ట్వీట్ చేశారు. మోదీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Pm Modi Congratulates Chiranjeevi: ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. చిరంజీవి విలక్షణ నటుడని మోదీ ప్రశంసలు కురిపించాడు. చిరంజీవిని అభినందిస్తూ మోదీ సోమవారం ట్వీట్ చేశాడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి ఎన్నో తరాల ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణను చిరంజీవి చూరగొన్నారని మోదీ అభినందించారు.
గోవా లో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా చిరంజీవికి అభినందనలు అంటూ మోదీ ట్వీట్లో పేర్కొన్నాడు. చిరంజీవిని ఉద్దేశిస్తూ మోదీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలుగులో మోదీ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఆదివారం గోవాలో ప్రారంభమైంది. ఇఫీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ను ప్రకటించారు. ఈ అవార్డుకు ఎంపికైన చిరంజీవిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అభినందిస్తున్నారు.
తండ్రికి అవార్డ్ వచ్చిన సందర్భంగా నువ్వే మాకు ఎప్పటికీ స్ఫూర్తి, అవార్డు రావడం గర్వంగా ఉందని రామ్చరణ్ ట్వీట్ చేశాడు. అన్నయ్య చిరంజీవిని అభినందిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రకటనను రిలీజ్ చేశాడు.