తెలుగు న్యూస్  /  Entertainment  /  Baby Producers Car Gift To Director Before Movie Release

Baby Director Get Car: విడుదలకు ముందే డైరెక్టర్‍‌కు నిర్మాతలు కారు గిఫ్ట్.. టీజర్ చూసే ఖరీదైన బహుమానం

13 October 2022, 14:53 IST

    • Baby Director Get Car: ఆనంద్ దేవరకొండ నటిస్తున్న బేబీ సినిమా డైరెక్టర్‌కు చిత్ర విడుదలకు ముందే ప్రత్యేక బహుమతి వచ్చింది. ఈ సినిమా నిర్మాతలు అతడికి సరికొత్త ఎంజీ హెక్టార్ ప్లస్ వాహనాన్ని బహుమతిగా ఇచ్చారు.
బేబీ సినిమా డైరెక్టర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్
బేబీ సినిమా డైరెక్టర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్

బేబీ సినిమా డైరెక్టర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్

Baby Director Get Car: విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం బేబీ. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా చేస్తోంది. సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత మారుతి, సాయి శ్రీనివాస కుమార్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ కూడా విడుదల కాకముందే.. దర్శకుడు సాయి రాజేశ్‌కు ఖరీదైన బహుమతి అందించారు సదరు చిత్ర నిర్మాతలు. బేబీ చిత్ర టీజర్ ఫుటేజీని చూసిన నిర్మాతలు మారుతి, సాయి శ్రీనివాస్.. అతడికి కొత్తకారును బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సాయి రాజేశ్ తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Prabhas: ఐపీఎల్ మ్యాచ్‍ కోసం రంగంలోకి ప్రభాస్.. భైరవ నయా లుక్‍తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ: వీడియో చూడండి

Baahubali The Crown of Blood: మరో రూపంలో బాహుబలి వస్తోంది.. ప్రకటించిన దర్శక ధీరుడు రాజమౌళి: వివరాలివే

Siddharth Roy OTT: బోల్డ్ రొమాంటిక్ మూవీ సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..

Pushpa 2 First Song: పుష్ప 2 ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైమింగ్‍లో మార్పు.. అల్లు అర్జున్ నయా లుక్ రివీల్

"సినిమా బాగా తీశానని ఇష్టమో.. హిట్ కొట్టాల్సిందే అని బ్లాక్ మెయిలో కానీ.. చిత్ర నిర్మాతలు కారును బహుమతిగా ఇచ్చారు. బేబీ టీజర్ త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. ఈ సారి కూడా నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. మీ పూర్తి మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నా" అని సాయి రాజేశ్ తన ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు.

ఇంతకీ సాయి రాజేశ్‌కు నిర్మాతలు ఇచ్చిన కారు ఏంటో తెలుసా? సరికొత్త ఎంజీ హెక్టార్ ప్లస్ వాహనాన్ని అతడికి నిర్మాతలు బహుమతిగా అందించారు. బేబీ ఫుటేజీని చూసిన వారు సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా పట్ల తమ ఆనందాన్ని తెలియజేస్తూ దర్శకుడికి ఎంజీ హెక్టార్ ప్లస్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. సాయి రాజేశ్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

సాయి రాజేశ్ కలర్ ఫొటో చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు ఇటీవల జాతీయ అవార్డు లభించింది. ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో ఈ చిత్రానికి నేషనల్ అవార్డు లభించింది. ప్రస్తుత ఆనంద్ దేవరకొండతో బేబీ సినిమాను ఈయన తెరకెక్కిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.