Stock market news today : ఫ్లాట్గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 19పాయింట్ల లాభం
22 November 2022, 9:18 IST
- Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
ఇండియా స్టాక్ మార్కెట్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 64పాయింట్ల లాభంతో 61,209 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 19పాయింట్లు వృద్ధి చెంది 18,179 వద్ద ట్రేడ్ అవుతోంది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 519పాయింట్లు కోల్పోయి 61,145 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 148 పాయింట్ల నష్టంతో 18,160 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్క్యాప్ 0.15శాతం పతనమవ్వగా.. స్మాల్ క్యాప్ సూచీ 0.01శాతం పెరిగింది. ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 61,127- 18,179 వద్ద మొదలుపెట్టాయి.
పివొట్ ఛార్ట్ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్ 18,136- 18,105 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 18,234- 18265 వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
- Stocks to buy today : వేదాంత:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 295, టార్గెట్ రూ. 325
- యాక్సిస్ బ్యాంక్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 854, టార్గెట్ రూ. 892
- హెచ్డీఎఫ్సీ లైఫ్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 520, టార్గెట్ రూ. 554
- అపోలో టైర్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 274, టార్గెట్ రూ. 292
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
యాక్సిస్ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
హెచ్సీఎల్ టెక్, పవర్గ్రిడ్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock markets : చైనా కొవిడ్ ఆంక్షలు.. అంతర్జాతీయ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చుపించింది. ఫలితంగా అమెరికా మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. డౌ జోన్స్ 0.13శాతం, ఎస్ అండ్ పీ 500 0.39శాతం, నాస్డాక్ 1.09శాతం పడిపోయాయి.
ఆసియా మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్పంగా పెరిగాయి. జపాన్ నిక్కీ 0.6శాతం లాభాల్లో ఉంది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.5శాతం వృద్ధిచెందింది. అదే సమయంలో సౌత్ కొరియా కాస్పి.. 0.34శాతం పడిపోయింది.
చమురు ధరలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో చమురు ధరలు భారీగా పతనమై.. అనంతరం కోలుకున్నాయి. బ్రెంట్ క్రూడ్.. 17సెంట్లు పడిపోయి 87.45డాలర్లకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,593.83కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,262.91కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.