Black Friday Sale: శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
23 November 2022, 15:23 IST
- Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సందర్భంగా శాంసంగ్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. వివిధ బ్యాంకులతో టైఅప్ చేసుకుని క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది.
బ్లాక్ ఫ్రైడే సేల్లో శాాంసంగ్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు
శాంసంగ్ మొబైల్ కంపెనీ ఇండియాలో బ్లాక్ ఫ్రైడే సేల్స్ ప్రకటించింది. నవంబరు 24 నుంచి నవంబరు 28 వరకు ఈ సేల్ లైవ్లో ఉంటుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా కంపెనీ శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3, గెలాక్సీ ఎస్ 22 సిరీస్, గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ తదితర స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.
బ్లాక్ ఫ్రైడే సేల్ పురస్కరించుకుని శాంసంగ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులతో టై అప్ చేసుకుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా జరిపే కొనుగోళ్లపై అవి క్యాష్ బ్యాక్స్, డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. కస్టమర్లు క్రెడిట్, డెబిట్ ట్రాన్సాక్షన్ల ద్వారా డిస్కౌంట్లు పొందవచ్చు. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై కూడా ఆఫర్లు లభ్యమవుతాయి.
Samsung Black Friday sale offers: శాంసంగ్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్స్ ఇవే
Samsung Galaxy S22 series: శాాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్
శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్ ఎస్22 స్మార్ట్ఫోన్లను రరూ. 60 వేల ధరకే అందించనుంది. ప్రస్తుతం శాాంసంగ్ వనీలా గెలాక్సీ ఎస్22 ధర రూ. 67,999గా ఉంది. అలాగే శాాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 22 ప్లస్ మోడళ్లపై డిస్కౌంట్లు కాస్త తక్కువగా ఉంటాయని అంచనా.
Samsung Galaxy Z Flip 4, Galaxy Z Fold 4: జడ్ ఫ్లిప్ 4, జడ్ ఫోల్డ్ 4
శాంసంగ్ తన తాజా ఫోల్డ్, ఫ్లిప్ సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలను రివీల్ చేసింది. ప్రస్తుతం గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 ధర రూ. 89,999గా ఉండగా, బ్లాక్ ఫ్రైడే సేల్లో రూ. 80,999లకే లభ్యమవుతుంది. సేల్ టీజర్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 రూ. 60 వేల లోపే విక్రయించనుంది. శాాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4 స్మార్ట్ ఫోన్ రూ. 10 వేల డిస్కౌంట్తో లభించనుంది.
Samsung Galaxy S20FE 5G: శాాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ
శాాంసంగ్ గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ 5జీ (8GB RAM + 128GB ROM) వేరియంట్పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీని ప్రస్తుత ధర రూ. 74,999గా ఉండగా, బ్లాక్ ఫ్రైడే సేల్లో ఆఫర్పై రూ. 31,999లకే విక్రయించనుంది. శాాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ రూ. 32,999లకు లభ్యం కానుంది. ఒకవేళ శాంసంగ్ యాప్ నుంచి కొనుగోలు చేస్తే కస్టమర్లు దీనిని కూడా రూ. 31,999లకే పొందవచ్చు.
Samsung M33 5G: శాంసంగ్ ఎం33 5జీ ఫోన్లపై
కస్టమర్లు శాంసంగ్ ఎం33 5జీ (6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ రామ్) వేరియంట్ రూ. 16,999లకే ఆఫర్ చేస్తుంది. దీని ప్రస్తుత ధర రూ. 24,999గా ఉంది.