తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Six Members Died In Chittoor Puthalapattu Road Accident

Chittoor Accident : వాగులో పడిన ట్రాక్టర్.. ఆరుగురు మృతి

HT Telugu Desk HT Telugu

07 December 2022, 23:25 IST

    • Chittoor Road Accident చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి బృందం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.
చిత్తూరులో పెళ్లి ట్రాక్టర్ బోల్తా
చిత్తూరులో పెళ్లి ట్రాక్టర్ బోల్తా (HT_PRINT)

చిత్తూరులో పెళ్లి ట్రాక్టర్ బోల్తా

చిత్తూరు(Chittoor) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. అప్పుడే సందడిగా గడిపిన వారు.. విగతజీవులుగా పడి ఉండేసరికి అందరూ షాక్ గు గురయ్యారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరు వద్ద పెళ్లి ట్రాక్టర్(Tractor) వాగులో పడింది. అందులో 26 మంది వరకు ఉన్నారు. ఒక్కసారిగా అదుపుతప్పి వాగులో ట్రాక్టర్ బోల్తా పడటంతో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలతోపాటుగా ట్రాక్టర్ డ్రైవర్ చనిపోయారు. ట్రాక్టర్‌లో ఐరాల మండలం బలిజపల్లికి చెందిన పెళ్లి బృందం ప్రయాణిస్తుంది. ఈ ఘటనలో మిగిలినవారు గాయపడ్డారు. వారిని తిరుపతి స్విమ్స్, వేలూరు సీఎంసీకి తరలించారు.

మృతుల్లో సురేంద్రరెడ్డి (52) (డ్రైవర్‌), వసంతమ్మ (50), రెడ్డెమ్మ (31), తేజ (25), వినీషా (3), దేశిక (2) ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారు.