తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Six Killed In Road Accident At Sri Sathya Sai District I

Road Accident in AP: సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి!

HT Telugu Desk HT Telugu

17 March 2023, 22:16 IST

    • Sri Sathya Sai district crime News: సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను బోలెరో ఢీకొట్టిన ఘటన ఆరుగురు దుర్మరణం చెందారు.
ఘోర ప్రమాదం
ఘోర ప్రమాదం

ఘోర ప్రమాదం

Road accident at Sri Sathya Sai district: ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ఆటోను బొలెరో ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆటో, బెలెరో చాలా వేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అక్కడికక్కడే ఐదుగురు చనిపోగా...మరొకొరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ధర్మవరం వైపు నుంచి బొలెరో(ఆటో) వాహనం బత్తలపల్లి వైపు వస్తుంది. బత్తలపల్లిలో ఓ ఆటో ప్రయాణికులను ఎక్కించుకొని ధర్మవరం వైపు వెళ్తోంది. ఈ క్రమంలో నాగులకట్ట వద్దకు రాగానే రెండు వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఫలితంగా ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన మరో ముగ్గురికి స్థానిక ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తున్నారు.

ఈ ప్రమాదం కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.